విజయవాడలో కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వంతెనను ఇవాళ సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని తెలిపారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్ నిర్మాణం చేపట్టామని, దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ కూడా ఏర్పాటు చేశామన్నారు. పార్కుకు కృష్ణమ్మ జలవిహార్గా నామకరణం చేశామని జగన్ తెలిపారు.