Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు..

by
congress srenulu

తెలంగాణ రాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గేలుపు పోందటం తో అవనిగడ్డ నియోజకవర్గంలోని, చల్లపల్లి, కోడూరు, అవనిగడ్డ ,మోపిదేవి, ఘంటసాల, మండల లో కాంగ్రెస్ నేతలు విజయోత్సవ వేడుకలుఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను పదేళ్లపాటు దోచుకున్న కేసీఆర్ కుటుంబ అవినీతి పరిపాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మీర్ రిజ్వాన్ ,కాగితాల సుదర్శన్ ,అది రామ్మోహన్ రావు పలువురు నాయకులుఅన్నారు. ఆదివారం సాయంత్రం చల్లపల్లి,కోడూరులో రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి, రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈసందర్భంగా రిజ్వాన్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న వనరులు, సంపద మొత్తం దోచుకుని కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు కలసి తెలంగాణ ప్రజల భవిష్యత్తును అంధకారంగా మార్చారన్నారు. అలాంటి దోపిడీ పరిపాలనను తెలంగాణ ప్రజలు అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వటం అత్యంత హర్షించదగ్గ పరిణామం అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019452
Total views : 90739

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.