11 మందిని హత్య చేసిన నరరూప రాక్షసుడిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన రామాటీ సత్యనారాయణ అనే హంతకుడు గుప్త నిధుల కోసం మంత్రాలు చేస్తానంటూ ఆస్తులు రాయించుకుని, డబ్బులు తీసుకొని వారిని హత్యలు చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు ఈ నిందితుడిని అరెస్టు చేసి డీఐజీ ,ఎల్ఎస్ చౌహన్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ నిందితుడి పేరు రామటి సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్ (47) సంవత్సరాలు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తో పాటు నాటు వైద్యం చేస్తూ అలాగే గుప్త నిధులు కోసం కూడా మంత్రాల చేసి తీస్తానంటూ చలామణి అవుతున్నాడు. గుప్తనిధుల తీయడానికి తన వద్దకు మంత్రాల కోసం వచ్చిన వారిని తను వశపరచుకొని వారి వద్ద నుంచి డబ్బులు, అలాగే ప్లాట్లు, భూములు తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాడు. ఇక తీర గుప్తనిధులు తీసే ప్రదేశంలో మంత్రాలు నిర్వహించి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు అంటూ గన్నేరు పప్పు నూరిన విషయాన్ని తీర్థంలో కలిపి బాధితులకు ఇచ్చేవాడు. ఇలా తీసుకున్న తీర్థాన్ని సేవించిన వారు అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందే వారు. మరికొందరిని బండరాళ్లతో కొట్టి చంపాడు ఈ నరరూప హంతకుడు. ఇలా నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, కల్వకుర్తి అనంతపూర్ కర్ణాటక ప్రాంతాలలో 11 హత్యలు చేసినట్లు పోలీసులు ప్రస్తుత విచారణలో తేలింది.
1,2020 సంవత్సరంలో వనపర్తి జిల్లాలో నలుగురి హత్య కేసులో ఇతడు నిందితుడు.
2,, 2021 సంవత్సరంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరినీ.
3) 2022 నాగర్కర్నూల్ జిల్లాలో సంవత్సరంలో ఒక్కరిని.
4) 2023 సంవత్సరంలో నలుగురిని హత్య చేశాడు ఈ నిందితుడు.
నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ సైకో కిల్లర్ ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇవే కాక మరికొన్ని మిస్సింగ్ కేసులో హత్య కేసులో ఇతని పాత్ర పై పోలీసులు విచారణ చేస్తామన్నారు. కోర్టులో న్యాయమూర్తి ద్వారా అనుమతి తీసుకొని మరికొన్ని కేసులలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఐజి ఎల్ ఎస్ చౌహన్, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మీడియా ముందు నేడు నిందితున్ని ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలియజేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన నాగర్కర్నూల్ సిఐ, ఎస్ఐ, జిల్లా పోలీస్ బృందాన్ని డిఐజి అభినందించారు. వారికి రివార్డు అందేలా కృషి చేస్తామన్నారు.
Crime
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తూరు నుంచి రేపల్లెకు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా, ఎర్రా కృష్ణమూర్తి కాలనీ, సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం. మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ. వై.కె.యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు. 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు. తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద, సోమవారం రాత్రి పది గంటల 45 నిమిషాల ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన రెండు బస్సులపై రాళ్లు విసరడంతో ముందు ఉన్న అద్దాలు పగిలిపోయాయి, బిత్తర పోయిన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకు లోనయ్యారు, ఎవరైనా దోపిడీ ముఠా ఈ విధంగా చేశారేమోనని తమను ఏమైనా చేస్తారేమోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు, డ్రైవర్ బస్సు దిగి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇది మందుబాబుల పని లేదా ఆకతాయిల పని అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారు, గడచిన రెండు నెలల కాలంలో ప్రైవేటు బస్సులకు సంబంధించిన ఆరు బస్సుల మీద ఇదేవిధంగా రాళ్ల దాడి జరిగింది, వేలాది రూపాయల ముందు అద్దాలు కిటికీలు ధ్వంసం చేశారని వాపోయారు డ్రైవర్లు, గంటాఊరు ఫ్లైఓవర్ పక్కన రెండు డాబా హోటల్స్ ఉన్నాయి,పూటుగా మద్యం తాగి ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని ఆకతాయితనంగా కొంతమంది వ్యక్తులు బస్సులపై రాళ్లు విసరడంతోనే ఈ విధమైన ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు, వరుస ఘటనలతో ప్రయాణికులకు ప్రాణ సంఘటనగా మారింది, దీనిపై గతంలో పోలీసులు నిఘా పెడుతున్నామని తెలిపినా, ఇంతవరకు ఖచ్చితమైన ఏర్పాట్లు అయితే లేవని స్థానికులు భావిస్తున్నారు, దీంతో ప్రైవేటు బస్సులు గంటాఊరు ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే ఎక్కడ తమ బస్సులపై ఎటువైపు నుండి రాళ్ళదాడికి దిగుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తూ బస్సులు నడుపుతున్నారు, కాగా రాత్రి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కచ్చితంగా నిందితులను పట్టుకొని శిక్షిస్తామని వారికి భరోసా కల్పించారు, ఏది ఏమైనా పలమనేరు గంటాఊరు ఫ్లైఓవర్ వద్ద ప్రయాణించాలంటే వాహన చోదకులు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం. హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు. ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో అక్రమ మద్యం అమ్మకాలు సమాచారం తో ఎస్ ఇ బి అధికారులు దాడి. పుదుచ్చేరి యానాం నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని,269 ఎన్.డి.పి.ఎల్. మద్యం సీసాలు,51బీర్లు స్వాదీనం చేసుకున్న అధికారులు..
చట్టాన్ని అతిక్రమించి నేరాలకు, అక్రమాలకూ పాల్పడే వారి పై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి లో డిఎస్పి కార్యాలయాన్ని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను కర్నూలు డి ఐ జి సెంథిల్ కుమార్, కలెక్టర్ గిరిషా పి ఎస్, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ముందుగా వారు పోలీస్ కమాండో గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోలీసు సిబ్బంది, ఇతరులు ఫ్లవర్ బుక్కేలతో పాటు శాలువాలతో సన్మానించి వారికీ ఘన స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పి కార్యాలయం, ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లు నిర్మాణాలను వేగంగా పుర్తియ్యేందుకు సహకరించిన వారికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, చట్టబద్దంగా తాము పని చేస్తున్నామని మాకు అన్ని రాజకీయ పార్టిలు సమానమేనని ఎ పార్టీ పట్ల వివక్షత చూపమని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువై వారికీ మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. ఇటివల వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన పట్ల పూర్తిగా విచారణ చేపట్టామని దోషులు ఎవ్వరైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన జిల్లా పోలీసు సిబ్బంది కొరత లేకుండా సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే పోలీసు నియామకాలు చేపట్టి పోలీసు సిబ్బంది కొరత లేకుండా చేస్తామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేరాల సంఖ్యా తగ్గు ముఖం పట్టిందని తెలియజేశారు. దిశా యాప్ ని సుమారు కోటి యాబై లక్షల మంది తమ సెల్ ఫోన్ లలో నమోదు చేసుకోన్నరన్నారు. దిని ద్వారా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారి పై క్షణికకాలంలోనే సమాచారం అందుతుందని, అలాంటి కామందులు, ఆకతాయిలకు దండన తప్పదని హెచ్చరించారు. ఇటివల కాలంలో అవగాహనా లోపంతో కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయని భార్యాభర్తలు, కుటుంబ సభ్యులకు తగిన రీతిలో కౌన్సలింగ్ ఇచ్చి వారి కాపురాలు సజావుగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని చెప్పారు. అజాగ్రత్తల కారణంగానే, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి యువకులు అతివేగంగా వాహనాలు నడుపుతుండడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అన్నిరకాల చర్యలతో అడ్డుకట్ట వేస్తున్నామని వివరించారు. రాయచోటి పట్టణంలో మరొక పోలీసు స్టేషన్ కు అనుమతులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తమను కోరారన్నారు. అందుకు త్వరలోనే పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పుత్తూరు సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐదుగురు దొంగలను పట్టుకున్న పోలీసులు.. 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని ఐదుగురు దొంగలను రిమాండ్ కు పంపిన పుత్తూరు డి.ఎస్.పి. ఈ దొంగతనాలు తిరుచానూరు వడమాల పేట గాజుల మన్యం, నారాయణవనం, పుత్తూరు, నగరి, తమిళనాడు లోని అతి మంజరి పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగినట్లుగా డి.ఎస్.పి వివరించారు.
పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ (28) కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు. రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేకుల షెడ్ పనులు చేస్తున్న సమయంలో షెడ్ పై పోతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి కాలినట్లు స్థానికులు సమాచారం. హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స వైద్యులు అందించారు. మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.