Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh పాడైన బ్రిడ్జి… పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు

పాడైన బ్రిడ్జి… పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు

by Prakash
A bridge leading to the ruins

నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే చిన్న మామిడిపల్లి బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరి ప్రమాదకరంగా తయారైన స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. నిత్యం రైల్వే స్టేషన్ కు చిన్నమామిడిపల్లి, నర్సాపురం, సరిపల్లి, కొప్పర్రు, మత్స్యపురి వైపుగా వేల మంది ప్రయాణికులు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ఉంటారని అటువంటి ఈ బ్రిడ్జ్ పేచ్చులు ఊడి కింద పడిపోవడంతో ఆ రంధ్రంలో ఎవరైనా కాలు పెడితే కాలు విరిగి పోవడం లేదా కాలువలో పడిపోవడం జరుగుతుందని ఇటీవల కాలంలో అనేకమంది ప్రమాదాలకు గురయ్యారని స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అనేక చోట్ల రోడ్ల పరిస్థితి ఏమీ బాగో లేకపోయినా ప్రజలు సర్దుకుపోతున్నారని కనీసం పట్టణంలోని ఈ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఈ పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

039513
Total views : 197525

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: