281
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది. ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో.. ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ఇసుక దోపిడీని ఆపకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై దేవినేని ఉమా మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే.. ప్రశ్నిస్తున్న తమ నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు.




Total views : 78870