Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshWest Godavari వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు..

వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు..

by Rama
vaikunta dwaram

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ఆలయ సాంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.

Advertisements

You may also like

Our Visitor

025424
Total views : 147249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.