రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.
Devotional
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కల నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా టెక్కలిలో భారీగా ఊరేగింపులు జరపడంతో పాటు భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు.
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.
కాకినాడ, కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర. కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది. గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు, యువత, యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు. నగరంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయి. వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు.
మంచిర్యాల జిల్లా, మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు. ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం, సంతోషం తో జరుపుకోవాలని అన్నారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం. వేకువజామునే బాజా భజంత్రీలు, భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ సేవగా ప్రారంభమై ముమ్మిడివరం లో పలు రామాలయాల మీదుగా రామనామా సంకీర్తనలతో ముమ్మిడివరంలో సాగిన గ్రామోత్సవం. పాల్గొన్న భక్తులు..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు. ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా శోభయాత్ర ప్రారంభమై నిజాంపేట్ చౌరస్తా, జె ఎన్ టి యూ, వివేకానంద నగర్, క్రొమో షో రూమ్ మీదగా మెట్రో షాపింగ్ మాల్ సమీపంలోని హుడా పార్కింగ్ దగ్గర శోభయాత్ర ముగుస్తుందని, శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రథని అధిరోహించగా శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ శ్రావణి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం మన దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని, ఇది మన వైదిక సంస్కృతి అన్నారు. ఈ రథయాత్రలో వేలాదిమంది వైష్ణవ భక్తులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ, భక్త బృందాలచే శ్రావణమైన కీర్తనలు ఆలపిస్తూ రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయోధ్యలో మెగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 30 వేల మందికి పైగా సాధువులకు నెల రోజులు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ గాయని సునీత, ప్రముఖ యాంకర్ సుమ కనకాల…రోషన్ కనకాలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి, నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.