Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కడియం శ్రీహరి…

by Prakash
Kadiam Srihari visited Tirumala Srivara

తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి, నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039895
Total views : 201458

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: