విజయవాడ, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం. జూలై లో జీతాలు పెంచుతాం. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు.
anganwadi news
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ కార్యకర్తలు అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించిన పొలిసులు. కూలీలు మేము అంగన్వాడీ కార్యకర్తలు కాదు అని చెప్తున్న వినకుండా వారిని స్థానిక ఒక ఫంక్షన్ హల్ కు తరలింపు. అదే ఫంక్షన్ హల్ లో అప్పటికే అదుపులో తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతు కూలీలు. చివరికి రైతు వచ్చి మా పొలంలో పనికి వచ్చిన కూలీలు అని చెప్పిన తర్వాత వారిని వదిలిన పోలీసులు.
కాకినాడ జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42వ రోజుకు చేరుకుంది ఒక పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వెల్లడించారు. తమని చలో విజయవాడ పిలుపులో భాగంగా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారని మమ్మల్ని చంపిన మేము సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు.
విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు. అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు. ఇప్పటికే బస్టాండ్ , రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఎస్మాచట్టం అమలులో ఉంది కాబట్టి చలో విజయవాడ కు అనుమతి లేదన్న సీపీ. అంగన్వాడీలపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం. విధులకు హాజరు కాని అంగన్వాడీల తొలగింపుకు ఉత్తర్వులు సిద్దం చేసిన కృష్ణాజిల్లా, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్లు. 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ వాసులు త్రాగునీటి కోసం ఆర్డీటీ ఆసుపత్రికి ఎదురుగా ప్రధాన రహదారి పై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. త్రాగునీటి కోసం కాళీ బిందెలతో మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం నీళ్లు లేని రాజ్యం అంటూ మహిళలు నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. గొంతులోకి గుక్కెడు నీరు అందక రోడ్డెక్కామని ఏమి సీఎం అని ఇదేమి రాజ్యమని సీఎం పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నామన్నారు. ఉప్పు నీటి కోసం రెండు కిలోమీటర్లు వెళ్లి తెచుకుంటున్నామని మండిపడ్డారు. సమ్మె లో ఉన్న శ్రీరామిరెడ్డి కార్మికులకు జీతాలు ఇస్తేనే కదా నీళ్లు విడిచేది ఇలా చేస్తే ఎలా అని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు నిలదీశారు. కనీసం మా కౌన్సిలర్ కాలనీ వైపు తొంగి కూడా చూడలేదు. కౌన్సిలర్ పరారీ అయ్యాడని మహిళలు మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోరు. ఎన్నికల వేల ఓట్లు కోసం వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని వైసీపీ నాయకులను దుయ్యబట్టారు.
పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. వారికి మద్దతుగా సిపిఐ, సిపిఎం, జనసేన, టిడిపి, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో, మానవహారం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాలలో దీక్షలు విరమించి, వెంటనే విధుల్లో చేరాలని స్థానిక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అంగన్వాడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీక్షలు విరమించి వెంటనే విధుల్లోకి చేరకపోతే టెర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నరని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం, స్థానిక వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా కానీ బెదిరేది లేదని వారు తెలిపారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా కూకట్ పల్లి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ టెంపుల్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రావణి తెలిపారు. ఈ నెల 22 సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదర్ నగర్ లోని మైసమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా శోభయాత్ర ప్రారంభమై నిజాంపేట్ చౌరస్తా, జె ఎన్ టి యూ, వివేకానంద నగర్, క్రొమో షో రూమ్ మీదగా మెట్రో షాపింగ్ మాల్ సమీపంలోని హుడా పార్కింగ్ దగ్గర శోభయాత్ర ముగుస్తుందని, శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రథని అధిరోహించగా శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రథయాత్రను పురస్కరించుకొని ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ శ్రావణి మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం మన దేశ చరిత్రలో కొత్త శకానికి నాంది అని, ఇది మన వైదిక సంస్కృతి అన్నారు. ఈ రథయాత్రలో వేలాదిమంది వైష్ణవ భక్తులు పాల్గొని సంప్రదాయ నృత్యాలు చేస్తూ, భక్త బృందాలచే శ్రావణమైన కీర్తనలు ఆలపిస్తూ రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అయోధ్యలో మెగా అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు 30 వేల మందికి పైగా సాధువులకు నెల రోజులు ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని తెలిపారు.
సీవీఆర్ న్యూస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా చే లాంఛనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా క్యాలెండర్ ను ఆవిష్కరించి అతిధులకు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ” నిష్పక్షపాతంగా వార్త ప్రసారాలు చేస్తూ, సమాజంలో సమూల మార్పులకు నాంది పలుకుతున్న సివిఆర్ న్యూస్ ఛానల్ మరిన్ని శిఖరాలు అందుకోవాలని మంత్రి రోజా శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ సినీ గాయని సునీత, ప్రముఖ యాంకర్ సుమ కనకాల…రోషన్ కనకాలలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.