శ్రీశైలం (Srisailam):
శ్రీశైలంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం (Akkamahadevi Jayantotsavam) దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకలు నిర్వహించారు ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి, మహాగణపతి పూజ, మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో, జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. విశేష పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణిగా ప్రసిద్ధి పొందిన అక్కమహాదేవి శ్రీమల్లికార్జునుడిపై సంస్కృత, కన్నడ భాషలలో ఎన్నో వచనాలు చెప్పింది. అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు. దీనితో శ్రీశైలం దేవస్థానం ప్రతి సంవత్సరం అక్కమహాదేవి జయంతోత్సవం విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు..వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. మే 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..మంత్రి టీజీ…
- జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం ..పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జీగిరాంలో ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన జ్యూట్ ఫ్యాక్టరీ నేడు మూతపడిన గేట్లతో కార్మికుల కన్నీటి గాథగా మారింది. 1986 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ…
- ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్..పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామాలయం నిర్మాణ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్మాణంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా…





Total views : 81449