అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి వారి మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, విభూది, పసుపు, గంధం, కుంకుమ, రుద్రాక్ష, పుష్ప, జల, ఫలరసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రాకారోత్సవ కార్యక్రమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Devotional
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పందొమ్మిదవ శతాబ్దంలో ఈ భువిపై వెలసిన సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుడు. తనను మనస్ఫూర్తిగా విశ్వసించి తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేద్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధనలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి, సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మిన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యలను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సంప్రదాయాలకు, మతాలకు చెందినది. అటువంటి ఒక విచిత్రమైన లీలలను ఇప్పుడు స్మరించుకుందాం.
శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టరుకు చూపించుకొని వారిచ్చే మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బ్యూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికి మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ“ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనము చేయకూడదు“ అని దృఢంగా పలికారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప డాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.
మరొక సందర్భంలో బూటీకి కలరా వ్యాధి సోకింది. ఒక రోజులో తీవ్రంగా నీరసించిపోయాడు.ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కూడా తాగలేకపోయాడు. బూటీకి సన్నిహితుడు డాక్టర్ పిళ్లై తన వద్ద వున్న ఔషధముల నింటినీ ప్రయత్నించాడు. కానీ ఇది కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాముపప్పు, పిస్తా,అక్రోటు లను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చెప్పారు. ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైద్య శాస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతిచిత్రంగా బ్యూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలోనే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.
ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలు అన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించి వేశారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికి శిరోధార్యం. బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు. సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు, వైద్య విధానాలు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే!బాబా ఆజ్ఞను శిరసా వహించి వారికి ఆయన యొక్క అనుగ్రహ,కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫీగా సాగిపోతుంది.
Read Also..
Read Also..
దేశంలో అత్యధిక భక్తులు సందర్శించే జాతర మేడారం. అయితే వచ్చే నెలలో జరగబోయే మేడారం జాతర నిర్వహణకు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక శ్రధ్ద చూపుతోంది. వచ్చే నెలలో జరగబోయే మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖకు సూచించింది. మేడారం సమ్మక్క సారక్క జాతరపై హైదరాబాద్లోని ఎంసీహెచ్ ఆర్డీలో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ జాతరలో గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారుల బృందాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దఫా జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలన్నారు. భక్తులు.. వన దేవతలను ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి అంతే ప్రశాంతంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also..
కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు. ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు. ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప రుషి ఉండేవారు. ఆయన మొవ్వకి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు. ఒక రోజు ఆ మహర్షికి నదీతీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల మహర్షి. దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది. వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టంచారు. అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో సంజీవని ఉంటాయి. ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే, మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ, సంజీవనీ రెండూ కనిపిస్తాయి. మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పద్యాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. క్షేత్రయ్య పెద్ద పండితుడు మీ కాదు. ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి. కానీ నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు, అతని నాలుక మీద బీజాక్షరాలు రాశారు. దీంతో వరదయ్య స్వామి వారి మీద గీతాలు రచించేంత జ్ఞానిగా మారాడు. తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు. ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అని పేరు స్థిరపడిపోయింది. మొవ్వ వేణుగోపాలుడు దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది.
కాకినాడ, ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ. కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు.
నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 22వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 4 గంటలపాటు కొనసాగింది. అనంతరం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 59 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 57 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 2 వాయిదా వేశామన్నారు. శ్రీ స్వామి అమ్మవారి ప్రాతఃకాల సేవలో పాల్గొనే భక్తులకు వెండి శివపార్వతుల ప్రతిమను ఇవ్వాలని నిర్ణయించారు. అలానే క్షేత్ర పరిధిలోకి పులులు రాకుండా శివరాత్రి లోపు ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. క్షేత్ర పరిధిలో ప్రసార వ్యవస్థకు ఎల్ఈడి విద్యుత్ కు 20 లక్షలు కేటాయించామన్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక బ్యాంకుల ద్వారా మరో మూడు ఏటీఎంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సందర్శనకు ఏనుగుల చెరువు వద్ద మల్లమ్మ కన్నీరు వద్ద సుమారు 20 ఎకరాల్లో నందనవనం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలానే పక్షులకు వన్యమృగ పార్కు ఏర్పాటు చేస్తామని, విద్యుత్ ఉత్పత్తికి హైడ్రాలిక్ మిషన్ కి 40 లక్షలకు కూడా ఆమోదం తెలియజేసారు. ముఖ్యంగా రాబోవు శివరాత్రి, రోజువారి అవసరాల కోసం సీసీటీవీ నిర్వహణకు 34 లక్షల ఆమోదించారు. నంది సర్కిల్ వద్ద రహదారి విస్తరణ, రుద్రపార్క్ వద్ద చైన్ లింక్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల నిత్యాన్నదాన భవనంలో వివిధ మరమ్మత్తులకు 15 లక్షలు ఆమోదించి ఇటీవల అటవీశాఖ నుండి దేవస్థానం భూముల బదలాయింపులో అటవీశాఖ కొన్ని కండిషన్స్ పెట్టగా వాటిని పునఃపరిశీలించాలని లిఖితపూర్వకంగా అటవీశాఖ అధికారులకు తెలుపుతామన్నారు. అలానే దేవస్థానంలో పని చేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డ్ లో ఆమోదం తెలిపి కమిషనర్ కు పంపుతామని చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు.
కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రానికి వేకువ జాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక లడ్డు, ప్రసాద కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
Read Also..
Read Also..
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బగేల్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పాలక మండలి చైర్మన్ చిన్ని కృష్ణయ్య, ఈవో పురేందర్ కుమార్ స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, బిజెపి శ్రేణులు వారి వెంట ఉన్నారు.
Read Also..
శ్రీకాకుళం జిల్లాలో వంశధారానదికి ఎడమ గట్టున నగరికటకం, ముఖలింగం అనే రెండు గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల నడుమ, ముఖ్యంగా ముఖలింగంలో మధుకేశ్వరాలయం, సోమేశ్వరాలయం, భీమేశ్వరాలయం అని మూడు శైవ దేవాలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలలో “మధుకేశ్వరాలయం” అతి పురాతనమైనది, చారిత్రక ప్రసిద్ధమైనది.
దేవాలయం కథ :
ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యోగాన్ని చూడటానికి గంధర్వ రాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాలమీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు. శబర కాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి ‘ సభామర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి’ అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడుగా జన్మించాడు. అతని రాణి చిత్తి. రెండవ భార్య చిత్రకళ. ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. చీటికీ మాటికీ కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్తను చేరి ‘నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిత్కళైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చి చెప్పు’ అని అతనిని నిలదీసింది. శబర నాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన రెండవరాణి అయిన ఛిత్కళను పిలిచి ‘మన వాకిలిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు రెండు వంచి, రాలిన పువ్వులు ఏరుకుని, వాటిని అమ్ముకుని బతకమన్నాడు. మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక, ఇప్పచెట్టు కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు ఏరుకునేది. అయితే ఆమె శివభక్తురాలు కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది. ఈ సంగతి తెలిసి చిత్తి అసూయ చెంది చిత్కళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్నచెట్టే కారణమని తలచి, ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసి శబర నాయకుడు మూర్ఛబోయాడు. దీనికంతటికీ చిత్కళయే కారణమని తలచి శబరులంతా కలిసి చిత్కళను చంపడానికి సిద్ధబడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబరరూపులైన ఆ గంధర్వులకు శాపవిముక్తి అనుగ్రహించాడు. ఆ విధంగా మధూక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలసాడు. మధుకేశ్వరాలయానికి ముందు పెద్ద నంది విగ్రహం ఉంది. గర్భాలయంలో తెల్లని ముఖలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఉన్న అనేక శాసనాలలో అతి ప్రాచీనమైన శాసనం, శిల్ప లక్షణాధారం ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్ధిలో నిర్మాణం జరిగి ఉండవచ్చునని పరిశోధకుల అభిప్రాయం. ఇతర భక్తుల సంగతి ఎలా ఉన్నా మధుకేశ్వరుడు శబరుల, గిరిజనుల ఆరాధ్యదైవంగా ఇప్పటికీ పూజింపబడుతూండడం శబరుల అవ్యాజభక్తికి నిదర్శనం.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి శరవేగంగా జరుగుతున్న వేళ రామయ్యకు అత్తారింటి నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. సీతాదేవి జన్మించిన నేపాల్లోని జనక్పూర్ నుంచి 3 వేలకు పైగా బహుమానాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండివిల్లు వంటివి ఉన్నాయి. జనక్పూర్లోని రామ్జానకి ఆలయ పూజారి రామ్ రోషన్దాస్ వీటిని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందించారు. 800 మంది భక్తులు 500 డబ్బాల్లో 30 వాహనాల్లో కాన్వాయ్గా ఈ బహుమతులను తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారు, వెండి వస్తువులు, డ్రైఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ మిఠాయిలు వంటివి ఉన్నాయి.