Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home TelanganaMahabubnagar అమ్మవారిని దర్శించుకున్న సత్యపాల్..

అమ్మవారిని దర్శించుకున్న సత్యపాల్..

by Rama
central minister

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బగేల్ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందజేశారు. పాలక మండలి చైర్మన్ చిన్ని కృష్ణయ్య, ఈవో పురేందర్ కుమార్ స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, బిజెపి శ్రేణులు వారి వెంట ఉన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039518
Total views : 197757

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: