Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh అగ్నిప్రమాదంలో దగ్ధమైన పశుగ్రాసం..

అగ్నిప్రమాదంలో దగ్ధమైన పశుగ్రాసం..

by Prakash
fire accident fodder

పటాకులు మిరగల్లు పడి పశుగ్రాసం వరి గడ్డి దగ్దమైన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురం ధర్మారెడ్డి విధి నందు చోటు చేసుకోంది.దీంతో సమాచారం అందుకొన్న అగ్నిమాపక అధికారి వెంకట్రామి రెడ్డి అద్వర్యంలో హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు .మంటలను అదుపులోకి తీసుకువచ్చారు .వారు తెలిపిన వివరాల మేరకు ధర్మా రెడ్డి విధికి చెందిన రాజమ్మ ,సహదేవ రెడ్డి లు కొత్తపేట రామాపురం లో నివాసం ఉంటూ కొన్ని పసువులను (గేదలను )మేపుకొంటు జీవనం సాగిస్తున్నారు .గేదలకు కావాల్సిన పశు గ్రాసం ను సుమారు లక్ష రూపాయలు వెచ్చించి ఎనిమిది లోడ్ల వరి గడ్డిని కొనుగోలు చేసుకొని తన నివాసం వద్ద ఓక వామి గా ఏర్పాటు చేసికొన్నారు .నిన్నటి దినమ దీపావళి పండుగ సందర్బంగా అక్కడే సమీపంలో రాత్రి సమయంలో బాణాసంచాలు పేల్చే క్రమంలో రాకెట్ మిరగల్లు గడ్డి వమి పై పడడంతో చిన్న చిన్న మంటలు పెద్ద పెద్ద మంటలుగా ఏర్పడి వరి గడ్డి అగ్గి మంటలకు ఆహుతి అయ్యింది .పైగా నిద్ర సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు .అప్పటికి పశుగ్రాసం పూర్తిగా మంటలలో పూర్తిగా దగ్ధమై బూడిద కావడంతో సుమారు లక్ష రూపాయలు పశుగ్రాసం నష్టం వాటినట్లు వారు తెలియజేశారు .నివాసాల మధ్య మంటలు పెద్దగా చెలరేగడంతో నివాస ప్రజలు బయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు

Advertisements

You may also like

Our Visitor

039251
Total views : 194966

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: