Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Main News కబ్జాకు గురవుతున్న అటవీ భూమి… పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

కబ్జాకు గురవుతున్న అటవీ భూమి… పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

by Prakash
Encroached forest land

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగ్సన్ పల్లి గ్రామ శివారులోని 93 సర్వే నంబర్ లో గల 20 ఎకరాల అటవీ భూమి ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కబ్జాకు గురైందని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు ఆరోపించారు. 30 కోట్ల విలువ గల అటవీ భూమి కబ్జా చేపడుతున్నారని కబ్జా చేపట్టిన స్థలంలోని చెట్లు నరికి అటవీలోని కాలువలో మట్టితో కప్పెడుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అటవీ భూమి కబ్జాకు గురవుతున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోక పోగా దురుసుగా మాట్లాడుతున్నారంటూ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు. అటవీ భూమికి ఆనుకొని ఉన్న బంజారా లక్ష్మీ పౌల్ట్రీ యజమానులు ఈ కబ్జా చేపడుతున్నారంటూ కబ్జా జరుగుతున్న విషయం తెలిసి కూడా ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారి DFO కు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. DFO మాట్లాడుతూ గతంలో జైంట్ సర్వే నిర్వహించామని, 144 ఎకరాల ఫారెస్ట్ భూమిని సర్వే చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని, చెట్లు నరికినందుకుగాను వాల్టా అటవీ చట్టం ప్రకారం కేసులు చేపడతామంటూ కబ్జాకు గురి అయిన హద్దురాలను తొలగియ్యనున్నట్లు సూచించారు ఫారెస్ట్ అధికారి DFO.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: