పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ప్లాంట్ కు సంబంధించిన క్రషర్ నగర్ యాష్ పాండ్ నుంచిఅక్రమంగా బూడిద సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్ , వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. జెన్ కో పవర్ ప్లాంట్ సెక్యూరిటీ అధికారి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు యాష్ పాండ్ లో నిన్న రాత్రి బూడిదను తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. వెంటనే రెండు బూడిద లారీల తో పాటు ఒక కారు, ఒక ఎక్సవేటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బూడిదను తరలిస్తూ లక్షల రూపాయలు గడుస్తున్నారని రామగుండం సీఐ అజయ్ బాబు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు…
- విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ…
- భారత్కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్.రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది. ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్కు వచ్చినట్టు తెలిపాయి…
- సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో చెత్త సెగలు రేపుతోంది.. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్త తెలంగాణ సరిహద్దు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది..ఆ చెత్త కంపు వల్ల రోగాల బారిన పడుతున్నామని తెలంగాణ సరిహద్దు గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి.. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో…
- భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.తెలంగాణ ప్రభుత్వం భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ విలువల సవరణకు ఆమోదం తెలిపింది. కొత్త మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ల ధోరణి, డిమాండ్ వంటి అంశాలను…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 92238