Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshVishakapattanam వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి భారీ చేరిక..

వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి భారీ చేరిక..

by Rama
giddi Eswari

అల్లూరి జిల్లా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా, పాడేరు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అభిమానులు కార్యకర్తలు పూల జల్లులతో చింతపల్లి నలుమూలల పర్యటించారు. అనంతరం చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో, నేను మీకు అండగా ఉన్నాను, మన ప్రభుత్వ రావడానికి ఒక్క నెల మాత్రం ఉంది, మీ భవిష్యత్తు గ్యారెంటీ మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయిన నన్ను పిలవండి నేను వస్తాను.. మీ సమస్య తీరుస్తాను.. మీ శరీరం మీద ఈగ పడితే నా శరీరం మీద దుడ్డు పడినట్లే మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుండేది లేదని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీలో పనిచేస్తున్న ముఖ్య నేత చిందాడ, చిన్నతోపాటు, అంబేద్కర్ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీలోకి గిడ్డి ఈశ్వరి చేతుల మీదుగా, తెలుగుదేశం కండువాలు వేసుకొని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు పై అభిమానంతో ఈ రోజున ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014094
Total views : 78964

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.