గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో మహిళా దారుణ హత్యకు గురైంది. సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. సూర్యనారాయణ ను అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరచడంతో, ఎన్టీఆర్ కాలనీలో కలకలం చోటుచేసుకుంది. గణపవరం చెందిన సూర్యనారాయణతో, రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది. పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని సరిచేసుకుందామని ఆదివారం గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్నా రామలక్ష్మిను, భర్త సూర్యనారాయణ విచక్షణ రహితంగా పొడిచి చంపి పరారయ్యాడు. అల్లుడి చేతిలో రామలక్ష్మి తండ్రి వెంకన్న గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన గుడివాడ వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..
321
previous post





Total views : 147697