Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Telangana మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

by Rama
మనసు చంపుకొని హైడ్రా పనులు మొదలు పెట్టాం

ప్రజా ఉదమ్యంగా చెరువుల పునరుద్ధరణ చేపడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా చర్యలు తీసుకోవడంతోనే ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లపై ప్రజల్లో చర్చ జరిగి అవగాహన పెరిగిందన్నారు. ఎఫ్ టీఎల్ లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులను పరిరక్షించడం హైడ్రా ఉద్ధేశం కాదన్నారు. ఇప్పటికే ఎఫ్ టీఎల్ పరిధిలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కూల్చే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకూ చాలా ఆక్రమణలు జరిగాయని, ఇకపై వాటి పరిధిలో కొత్త నిర్మాణాలు జరగకుండా చూడటమే ప్రభుత్వ ఉద్ధేశం. ఇప్పటివరకూ తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే కూల్చివేశామన్నారు. పేదలవైనా, పెద్దలవైనా అనుమతులు లేకుంటే కూల్చివేశామని, ఈ క్రమంలో తాము మానవత్వ కోణంలో ఆలోచిస్తే సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. మనసు చంపుకొని కూల్చివేతలు చేపట్టామన్నారు. చెరువుల పై ఇప్పటికే నాలుగు వేలకుపైగా ఫిర్యాదులు అందాయన్నారు. స్థానికుల భాగస్వామ్యంతో రక్షిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు పుతిన్‌ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
  • పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.
    పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్‌ 7న హ్యూమనాయిడ్‌, క్వాడ్రుపెడ్‌ రోబోలు వీధుల్లో మార్చ్‌ నిర్వహించాయి. పోలాండ్‌ డిజిటల్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.
    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: