కన్నతల్లిని భారంగా భావించింది ఓ కూతురు .. జాలి , దయ లేకుండా మతిస్థిమితం లేని తల్లిని ఓ వృద్ధాశ్రమం ముందు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తల్లిని ఆశ్రమం వారుకూడా లోపలికి రానివ్వలేదు . దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూ ఉండిపోయింది.. ఈ ఘటన విజయవాడలో అందరిని మనసులను బాధకు లోను చేస్తుంది. తొమ్మిది నెలలు కని పెంచిన కన్న తల్లిని ఆ కూతురు భారంగా బావించింది. జాలి లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె.. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకుంది . మంచి చదువు చెప్పించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కానీ, ఆ కూతురు తల్లిని వదిలించుకోవాలనుకుంది. అమ్మ పట్ల కఠినంగా వ్యవహరించింది. మతిస్థిమితం కొల్పోయిన తల్లిని కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వారు మళ్లీ తీసుకురాకండి అని చెప్పడంతో అప్పటి నుంచి కూతురి ఇంటి వద్దే ఉంటోంది. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ, ఓ బైక్ పైన తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రావివ్వలేదు.. ఏం జరుగుతుందో తెలియని ఆతల్లి ఆశ్రమం గేటు పట్టుకొని దీనంగా తన కూతురి రాకకోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్ల దందా.ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్రమ లేవుట్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సరైన అనుమతులు లేకుండానే రియల్టర్లు వెంచర్లు వేసి.. ప్లాట్స్ అమ్మేస్తున్నారు. ప్రజల కష్టాన్నీ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒంగోలులో ప్లాట్స్ ప్రీలాంచ్ ఈవెంట్ నిర్వహించిన శ్రీభ్రమర…
- నిర్మల్ జిల్లా భైంసాలో ప్రైవేట్ పాఠశాలలపై ఎబివిపి నేతల ఆగ్రహం.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై ఎబివిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలపై పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు.…
- కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి ట్రిపుల్ ఐటీలకు ఎంపిక.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో సత్తా చాటారు. నియోజకవర్గం నుంచి ఏకంగా 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావడం గర్వకారణమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో…
- మెట్రోస విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయి-సీఎం రేవంత్రెడ్డి.మెట్రో విస్తరణను బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మెట్రో విస్తరణ జరిగేచోట బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారని తెలిపారు. సమస్యలపై మాట్లాడదామంటే కేంద్రమంతి కిషన్రెడ్డి సమయం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కిషన్రెడ్డి బాధ్యత తీసుకుని…
- రూ.33 లక్షల బకాయిల కోసం పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 143629