కన్నతల్లిని భారంగా భావించింది ఓ కూతురు .. జాలి , దయ లేకుండా మతిస్థిమితం లేని తల్లిని ఓ వృద్ధాశ్రమం ముందు వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తల్లిని ఆశ్రమం వారుకూడా లోపలికి రానివ్వలేదు . దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూ ఉండిపోయింది.. ఈ ఘటన విజయవాడలో అందరిని మనసులను బాధకు లోను చేస్తుంది. తొమ్మిది నెలలు కని పెంచిన కన్న తల్లిని ఆ కూతురు భారంగా బావించింది. జాలి లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె.. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకుంది . మంచి చదువు చెప్పించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన అవసరాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కానీ, ఆ కూతురు తల్లిని వదిలించుకోవాలనుకుంది. అమ్మ పట్ల కఠినంగా వ్యవహరించింది. మతిస్థిమితం కొల్పోయిన తల్లిని కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వారు మళ్లీ తీసుకురాకండి అని చెప్పడంతో అప్పటి నుంచి కూతురి ఇంటి వద్దే ఉంటోంది. అయితే, ఏం జరిగిందో ఏమోగానీ, ఓ బైక్ పైన తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలికి రావివ్వలేదు.. ఏం జరుగుతుందో తెలియని ఆతల్లి ఆశ్రమం గేటు పట్టుకొని దీనంగా తన కూతురి రాకకోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
- ఇరాన్తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.అమెరికా, ఇరాన్ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హర్మూజ్ జలసంధిని తిరిగి…
- ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
- చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్దే.ఈ మ్యాచ్ 20వ ఓవర్లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్లను శివాలయం బ్రిడ్జి వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 140695