Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కదనభేరీ

కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల కదనభేరీ

by Satya
KCR

కేసీఆర్(KCR) ఎన్నికల ప్రచారం ప్రారంభం..

కరీంనగర్‌ వేదికగా బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌(KCR) లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) కదనభేరీని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్(Karimnagar) నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ కంచుకోట అయిన కరీంనగర్​లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ 2023లో మాత్రం చతికిలపడింది. కేవలం ఐదింటిని మాత్రమే అత్తెసరు మెజారిటీతో సాధించి ఉనికి చాటుకుంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్‌(KCR) కరీంనగర్‌ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏ పథకమైనా, ఉద్యమమైనా కరీంనగర్‌ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని ఇదే సెంటిమెంట్‌తో ఎస్​ఎస్​ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్…


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039786
Total views : 200827

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: