Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం…

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం…

by Prakash
karnool government hospital

కర్నూలు నగరంలో ప్రభుత్వ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి(Kurnool Government Hospital) సిబ్బంది నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్‌ఓడీ గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేసి తాళం వేశారు. దీంతో ఆ బాలుడు 21 గంటల పాటు ఆ గదిలోనే నరకయాతన అనుభవించాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

గదిలో ఉన్న ఫ్రిజ్లోని నీరు తాగి కడుపు నింపుకున్నాడు. మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆపరేషన్ థియేటర్ గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపులు తీశారు. కనిపించకుండా పోయిన బాలుడు గదిలో కనిపించడంతో సిబ్బంది అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే వార్డు సిబ్బంది నిర్లక్ష్యం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: