నియంతల్లా మారి కొందరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. నియంతల్లా మారిన రీజనల్ పార్టీలు బడుగు బలహీన వర్గాలను సమానంగా చూడటం లేదు,
ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదు. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవ రెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేసానని మాట్లాడారు. అన్నా కొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా.. మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలను. అక్రమంగా సంపాదించుకోడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారని, నేను ఏమీ ఆశించి ఈరోజు వరకూ నా అన్న వద్దకు వెళ్ళలేదు.. దానికి సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి. ప్రభుత్వాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నాయి. సమాజంలో సోషల్ జస్టిస్ వంద శాతం లేదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి గుండు కొట్టి అవమానిస్తున్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వమని ప్రజలు ప్రమాణం చేయాలి.
వైసీపీ నేతల పై షర్మిల ఫైర్..
334
previous post





Total views : 197126