మద్యం కేసులో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను సీబీఐ కస్టడీ(CBI Custody)లోకి తీసుకుంది. తీహార్ జైలులో ఉన్న ఆమెను అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపు కోర్టులో కవితను ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మద్యం కేసులో గతంలో కవితను హైదరాబాద్లో సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ నెల 6న జైలులో మరోసారి ప్రశ్నించింది. ఆమెను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద సీబీఐ అనుమతి తీసుకుంది.