Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Main News ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి

ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి

by Rama
ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి

దేశంలో ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్లలో 2 వేల 853 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క గతేడాదిలోనే ఏకంగా 628 మంది గజరాజుల దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పర్యావరణశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్‌సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. గత ఐదేళ్లలో ఏనుగుల దాడిలో ఒడిశాలో అత్యధికంగా 624 మంది చనిపోగా అత్యల్పంగా కేరళలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత ఐదేళ్ల కాలంలో దేశంలో 628 పులులు చనిపోయినట్టు మంత్రి సభకు తెలిపారు. అలాగే పులుల దాడుల వల్ల 349 మంది చనిపోయినట్టు వివరించారు. వీటిలో సగానికి పైగా మరణాలు ఒక్క మహరాష్ట్రలోనే నమోదయ్యాయి. ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతి ఇక్కడ ఏకంగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. పులుల దాడుల్లో గతేడాది 82 మంది మృతి చెందినట్టు మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ సభకు తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఇరాన్‌ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు..
    ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా ఐదు కఠిన షరతులు విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు…
  • తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..
    తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్…
  • మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..
    వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది. కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలు రెండోసారి పెరిగాయి. రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు.…
  • మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..
    నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2024, 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేపదే పేపర్ లీక్‌లు…
  • నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..
    నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నిందితురాలు మనీషా గురునాథ్ మాంధరేనికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014327
Total views : 79936

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.