ముదిరాజుల సన్నాహక సమావేశం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముదిరాజులకు ఉచిత చేప పిల్లలు, చేపల వలలు, లునాలు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని కారణాల వలన ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్ లు ఇవ్వడం సాధ్యం కాలేదని, భవిష్యత్తులో ముదిరాజులకు సుముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కావున ముదిరాజులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 27న దేవరకద్ర నియోజకవర్గ ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలోని ముదిరాజులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
దేవరకద్రలో ముదిరాజుల సన్నాహక సమావేశం..
247
previous post





Total views : 147263