Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Latest News నేటి నుంచి తెలంగాణలో రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

నేటి నుంచి తెలంగాణలో రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

by Satya
నేటి నుంచి తెలంగాణలో రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ

రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. 5 ఎకరాలకు ఇవ్వాలా? లేక 10 ఎకరాలకు ఈ స్కీంను వర్తింప చేయాలా? అనే ఆంశంపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇందుకోసం నేటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో వరుసగా వర్క్ షాప్‌లు నిర్వహించనుంది.
రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ సమావేశాలు నేడు ఖమ్మం జిల్లాలో మొదలై ఈ నెల 23న రంగారెడ్డి జిల్లాలో ముగియనున్నాయి. సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం చైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ,సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాల్లోనేటి నుంచి తెలంగాణలో రైతుభరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ లో జిల్లా మంత్రులతో పాటు, ఇంఛార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.