బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది. ‘రేవంత్ గారూ’ అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే… ‘కేటీఆర్ గారూ’ అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా 2021లో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, 4 బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని… కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు వేలం పాట కోసం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను పంపించడం ఏమిటని విమర్శించారు. మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు.
బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని… ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని కేటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కేడర్ అంతా కేంద్ర ప్రభుత్వ, గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు. సింగరేణి మొదటి, రెండో బ్లాక్లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని… నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు విక్రయించారన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సింగరేణి బ్లాక్ల ప్రైవేటీకరణను, వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని… అదే సమయంలో అవంతిక, అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. బొగ్గుగనుల వేలంపై కేటీఆర్ ట్వీట్కు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసారు . తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులు, భవిష్యత్తు… కాంగ్రెస్తోనే సురక్షితమన్నారు. మన బొగ్గు గురించి మాత్రమే కాదు… ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడుతామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 198568