Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Andhra PradeshPrakasam చిల్డ్రన్స్ డే సందర్భంగా క్రీడలు

చిల్డ్రన్స్ డే సందర్భంగా క్రీడలు

by Rama
children's day Special

మార్కాపురం పట్టణంలోని వైయస్సార్ క్రీడా వికాస కేంద్రం నందు నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డే సందర్భంగా అండర్ 15 బ్యాట్మెంటన్ టోర్నమెంటు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొని, ఆటల పోటీలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు….అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులతో బ్యాట్మెంటన్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించడానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, అన్నారు. అదేవిధంగా మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్, అన్నివేళలా ముందుంటుందని, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించి వారికి ప్రోత్సాహం అందించాలని జిల్లా స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని, అన్నారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాస్, కౌన్సిలర్ నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారులు రాందాస్ నాయక్, శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పలు పాఠశాలల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

036145
Total views : 181064

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.