పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. భూమి, పశుసంపద, ప్రకృతిని అనుసంధానం చేసే గొప్ప సంప్రదాయమే ఏరువాక పండుగ అని అన్నారు.ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు లాభసాటి పంటలు వచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు నష్టపోకుండా ఉండేందుకు ఎరువులు, విత్తనాలు, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పత్తిపాటి పుల్లారావు.. రైతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జూలై 1 నుంచే కృష్ణా జలాలను విడుదల చేసి సాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.
42





Total views : 180026