ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ బ్యాటర్ జాకబ్ బెతెల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ, ఆఖరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుతిరగడంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ , కెప్టెన్ బట్లర్ , హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బెతెల్ ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అతనికి విల్ జాక్స్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి దూకుడుతో ఒకానొక దశలో ఇంగ్లండ్ గెలిచేలా కనిపించింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే బౌలింగ్ కు దిగాడు. మొదటి బంతికే డేంజర్ మ్యాన్ బెతెల్ రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదినప్పటికీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే పరిమితమైంది. మొత్తమ్మీద ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్దీప్, అక్షర్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, శివమ్ దూబే దూకుడుగా ఆడగా, చివర్లో తిలక్ వర్మ , హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 61 పరుగులు సమర్పించుకోగా, జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. 2024లో టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా…. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టైటిల్ సమరం మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది.
Sports
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఈ విషయాన్ని సింధు ‘ఎక్స్’లో వెల్లడించారు. ఓ మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన పీవీ సిందు..యుద్ధం కారణంగా రెండ్రోజుల నుంచి దుబాయ్లోనే చిక్కుకుపోయారు. అక్కడ తాను క్షేమంగానే ఉన్నట్టు రెండ్రోజుల క్రితం వీడియో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే..గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే ప్రత్యేక విమానాల్లో బెంగళూరు, ఢిల్లీ ఎయిర్పోర్టులకు చేరుకుంటున్నారు భారతీయులు.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్కు చేరింది. భారత జట్టు బ్యాటర్లలో సంజూ శాంసన్ (97), సూర్యకుమార్ యాదవ్ (18), తిలక్ వర్మ (27), హార్దిక్ పాండ్యా(17), శివమ్ దూబే(8)తో రాణించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ రెండు వికెట్లు, అకేల్ హోసేన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (40), జాసన్ హోల్డర్ (37*), రోమన్ పావెల్ (34*), షై హోప్ (32), షిమ్రాన్ హెట్మయెర్ (27), షెర్ఫానె రూథర్ఫోర్డ్ (14) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2.. హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.
టీ20 ప్రపంచకప్ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది. పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌతాఫ్రికా జట్టు.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం అయింది. సూపర్-8లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 76 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(0), అభిషేక్ శర్మ(15), తిలక్ వర్మ(1), సూర్యకుమార్(18), సుందర్(11), హార్దిక్ పాండ్యా(18), రింకూ సింగ్(0) పరుగులు చేశారు. శివమ్ దూబే 42 పరుగులతో చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 18.5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో మైక్రో జాన్సన్ 4, కేవవ్ మహరాజ్ 3, కార్బిన్ 2, మార్కరమ్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (63) హాఫ్ సెంచరీ సాధించగా.. డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు నాటౌట్ తో దూకుడుగా ఆడేశారు. మార్క్రమ్ (4), క్వింటన్ డికాక్ (6), రియాన్ రికెల్టన్ (7) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్దీప్ 2.. శివమ్ దూబె, వరుణ్ చెరో వికెట్ తీశారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇచ్చాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. నెదర్లాండ్స్తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లోనూ డకౌట్ అవ్వడంతో, ఈ టోర్నీలో అతను వరుసగా మూడోసారి సున్నాకే పెవిలియన్ చేరినట్టయింది. అంచనాల భారమే 25 ఏళ్ల అభిషేక్పై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని, అతను భారీ షాట్ల కోసం తొందరపడకుండా క్రీజులో సమయం గడపడంపై దృష్టి పెట్టాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సూచించాడు. వరుస వైఫల్యాలతో, టీ20 ప్రపంచకప్ల చరిత్రలో భారత్ తరఫున అత్యధిక డకౌట్లు నమోదు చేసిన ఆశిష్ నెహ్రా సరసన అభిషేక్ నిలిచాడు. స్టార్ స్పోర్ట్స్లో గవాస్కర్ మాట్లాడుతూ, అభిషేక్ మంచి ఆటగాడే, కానీ అంచనాలు అతనిపై భారం మోపుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి బంతికే బౌండరీ లేదా సిక్స్ కొట్టాలని ప్రయత్నించకూడదని, భారీ షాట్లు వాటంతట అవే వస్తాయనీ, బలవంతంగా ఆడకూడదంటూ విశ్లేషించాడు.
అమెరికాపై గోల్డెన్ డక్తో మొదలైన అభిషేక్ వైఫల్యం, పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్లలోనూ పునరావృతమైంది. ప్రతీసారి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు. ముందు ఒక పరుగు తీసి ఖాతా తెరవాలి. నాలుగైదు బంతులు డాట్ అయినా ఫర్వాలేదు, తర్వాత కవర్ చేయొచ్చు. కాస్త క్రీజులో కుదురుకుంటే, అతని సహజమైన ఆట అదే బయటకు వస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే, అభిషేక్ ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే ధీమా వ్యక్తం చేశాడు. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన అభిషేక్, కోలుకున్న తర్వాత నెట్స్లో తీవ్రంగా శ్రమించాడని తెలిపాడు. నెట్స్లో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని… త్వరలోనే ఫామ్లోకి వస్తాడన్నారు.. సూపర్ 8 దశ నాటికి అతను కీలకంగా మారతాడని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కీలకమైన సూపర్ 8 దశకు ముందు అభిషేక్ తిరిగి లయ అందుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ వేగంగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ వర్మ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించారు. అయితే, అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.
194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. బాస్ డి లీడ్ , కోలిన్ అకెర్మాన్ , జాక్ లయన్-కాచెట్ రాణించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది. సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్… ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనుంది.
ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి ఆహ్వానించారు. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు. విద్యార్థులు, యువతీ, యువకులు సీఎం కప్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సీఎం కప్ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విశ్వ విజేతగా భారత గ్రాండ్ మాస్టర్, యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు.ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, డింగ్ లిరెన్ ను ఓడించి ఛాంపియన్గా నిలవాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి.. దేశ ఖ్యాతిని మరో పెట్టు ఎక్కించిన గుకేశ్.. తెలుగు కుర్రాడు. ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా. తండ్రి.. రజనీకాంత్. ఈయన పేరు మోసిన డాక్టర్. చెవి, ముక్కు, గొంతు సర్జన్. తల్లి.. పద్మ. ఈమె మైక్రోబయాలజిస్ట్. ఈ దంపతులు చెన్నైలో స్థిరపడటంతో.. గుకేశ్ 29 మే, 2006న చెన్నైలో జన్మించారు. తల్లిందండ్రులిద్దరూ మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు. కానీ, వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు. 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలి రోజుల్లో రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు సాధన చేసేవాడు. అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను ఎంతో ఆకట్టుకుంది. మెళుకువలు నేర్చుకున్న అనంతరం వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలు పెట్టాడు. ఇతనికి తొలి విజయం అంటే.. తొమ్మిదేళ్ల వయస్సులో 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ 12 విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అండర్ 12 విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో ఐదు బంగారు పతకాలు సాధించాడు. 2017లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తద్వారా 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2023.. గుకేశ్ తనను తాను ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసిన సంవత్సరం. గతేడాది ఆగస్ట్లో 2750 రేటింగ్తో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి 36 ఏళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు. అనంతరం క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి 40 ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ విజయంతో భారత ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు.
విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత విజయంతో దేశం గర్వపడేలా చేశావని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చెస్ చరిత్రలో గుకేశ్ అతని పేరు చిరస్థాయిగా నిలవడమే కాకుండా యువతకు గొప్ప కలలు కనేందుకు మార్గం చూపావని ప్రధాని కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు. వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా.. అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ఇదే ఐపీఎల్ చరిత్రలో ఓ ప్లేయర్ కు వెచ్చించిన అత్యధిక ధర గా నిలిచింది. కాగా ఈ రికార్డు బ్రేకింగ్ ధరను కొద్ది సేపటికే భారత మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తిరగరాశారు. రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలోకి వచ్చిన పంత్ ను కొనేందుకు మొదట ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య పోటీ జరగ్గా.. 10 కోట్ల మార్కును దాటిన తర్వాత.. ఆర్సీబీ తప్పుకుంది.
అనంతరం రంగంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. పంత్ ను కోనేందుకు దాదాపు 20.50 కోట్ల వరకు వేలం పాడింది. అనంతరం పంజాబ్ జట్టు 20.75 కోట్లకు వేలం పాడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకునేందు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో అప్రమత్తమైన లక్నో జట్టు పంత్ కు ఏకంగా.. 27 కోట్లకు కోనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్టీఎమ్ చేసుకోవడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడు పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా కొద్ది క్షణాల క్రితం నిలిచిన శ్రేయస్ అయ్యర్ ను బీట్ చేసిన పంత్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. మొత్తానికి 27 కోట్లకు రిషబ్ పంత్ ను లక్నో జట్టు సొంతం చేసుకుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించాడు. సాలిడ్ డిఫెన్స్ తో పాటు అవసరమైన సమయంలో బ్యాట్ ను మంత్రడండంలా తిప్పుతూ మ్యాజికల్ షాట్స్ ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ దాటేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించాడు. పెర్త్ టెస్ట్ లో కొట్టిన తాజా సెంచరీతో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. అస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక అర్ధ శతకాలు బాదిన ఆసియా బ్యాటర్ల లిస్ట్ లో విరాట్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీతృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
- ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
- ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
- మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
- రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 33557