Monday, April 20, 2026
News Navigation
Monday, April 20, 2026
News Navigation

Breaking

Mobile Swipe Menu
Home Andhra Pradesh నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

by Rama
నేడు స్వర్ణాంధ్ర డాక్యూమెంట్ ఆవిష్కరణ

సీఎం చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరుకానున్నారు. సుమారు 500 బస్సులు ఏర్పాటు చేసి వారిని సభా స్థలానికి అధికారులు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఈ ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. విజయవాడలోకి భారీ వాహనాలు రాకుండా నగరం వెలుపల నుంచే వాటి రాకపోకలను నియంత్రిస్తున్నట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, గుడివాడ, పామర్రు అవనిగడ్డ మీదుగా మళ్లించనున్నట్లు చెప్పారు. చెన్నై- హైదరాబాద్ వెళ్లే వాహనాలను మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, నల్గొండ మీదుగా హైదరాబాద్‌కు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

006949
Total views : 46160

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.