Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Latest News అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్

అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్

by Satya
అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్

ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో జనం స్విట్జర్లాండ్ కే జైకొట్టారు. ఈమేరకు అమెరికాకు చెందిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ ప్రపంచ దేశాల తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించగా.. మొత్తంగా ఏడుసార్లు ఈ జాబితాలో టాప్ లో నిలిచింది. జీవన నాణ్యత, వ్యాపార అవకాశాల విభాగాల్లో స్విట్జర్లాండ్‌ ఉన్నత స్థానంలో, వారసత్వ రంగంలో అట్టడుగు స్థానంలో ఉంది. చాలా విభాగాల్లో టాప్ లో నిలవడంతో స్విట్జర్లాండ్ కు ఈ ఘనత దక్కింది. స్విట్జర్లాండ్ తర్వాతి స్థానంలో జపాన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా దేశాలు నిలిచాయి. టాప్ 25లో ఐరోపా దేశాలు ఉండగా.. భారతదేశానికి 33వ ర్యాంకు దక్కింది. గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు దిగజారింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
    తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
  • ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
    ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
  • ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
  • మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
    మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
  • రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..
    గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

004902
Total views : 33638

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.