ఏలూరు, దెందులూరు(Dendulur)లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. సిద్దం సభ(Siddam Sabha)కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ. సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా హాజరుకానున్న పార్టీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరొకసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలకు సిద్ధం సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్. చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్ళించిన పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90663