కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను తమ పథకాలుగా చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తే వారు ఆశ్చర్యపోతున్నారని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. టిడిపి, జనసేన పొత్తుల విషయం కేంద్ర పార్టీ చూసుకుంటుందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు.
Tag:
పురందేశ్వరి
గతకొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీద ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. పురందేశ్వరి ప్రతీ స్టెప్ పైనా సాయిరెడ్డి ఆన్ లైన్ వేదికగా స్పందిస్తుంటారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పురందేశ్వరి వ్యవహారశైలిపై విజయసాయిరెడ్డి విపరీతమైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి 2019 ఎన్నికలలో పురందేశ్వరి పెర్ఫార్మెన్స్ పై ఆన్ లైన్ వేదికగా స్పందించారు.






Total views : 78359