Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం…

జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం…

by Prakash
Purandeshwari

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను తమ పథకాలుగా చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఈ విషయాలను ప్రజలకు తెలియజేస్తే వారు ఆశ్చర్యపోతున్నారని పురందేశ్వరి తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. టిడిపి, జనసేన పొత్తుల విషయం కేంద్ర పార్టీ చూసుకుంటుందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో బిజెపి పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేస్తున్నట్లు ఆమె వివరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: