తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు.
కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం సేవించడానికి వచ్చి అసభ్యకరంగ ప్రవర్తిస్తున్నారని వెంటనే తమ నివాస ప్రాంతం నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ
adilabad district news
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పట్టణ అదనపు ఎస్.ఐ హరి శేఖర్ సిబ్బందితో పాలచ్చేట్టు దగ్గర దొరల బంగ్లా ఏరియా లో వెహికిల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక కారులో మల్లికార్జున్ నగర్, రామకృష్ణ పూర్ కి చెందిన సందీప్ కుమార్ సింగ్ అనే వ్యక్తి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకొని అతని వద్ద నుండి 1,36,630 రూపాయలు విలువ గల IMFL 690 క్వార్టర్ మందు బాటిల్స్ మరియు కారును సీజ్ చేసి కేసు నమోదు చేసమని మందమర్రి పోలీసులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి. నాడు మౌనంగా ఉన్న వారు కూడా ఎన్నికల వేళ నిలదీసే పరిస్థితులు వచ్చేశాయి. చిన్నయ్యపై భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సొంత గ్రామం జెండా వెంకటాపూర్ ను అయినా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక బెల్లంపల్లి పట్టణంలో సొంత పార్టీ నాయకులు పార్టీని వీడారు. ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కారు దిగిపోయారు. మరికొందరు అదే బాటన సాగుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. హాట్రిక్ విజయం ఎమ్మెల్యే చిన్నయ్య విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓటర్ల కరుణ కోసం ఆరాటపడుతున్నారను.
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా మేనేజర్ శ్రీహరి , బిల్ కలెక్టర్ మహేందర్ ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్ పి( Dsp) రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లక్షేట్టిపేట మున్సిపల్ పరిధిలోని ఇటీక్యాల గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటికి నెంబర్ కేటాయించడానికి మే నెలలో మున్సిపల్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకొన్నాడు. నెంబర్ కేటాయించడానికి లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని మేనేజర్ శ్రీహరి డిమాండ్ చేసాడు. బాధితుడు శ్రీనివాస్ చివరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకొని
బాధితుడు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు శ్రీనివాస్ నుంచి పదిహేను వేల రూపాయలు లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ వెన్నంట ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అలాంటి బాల్క సుమన్ కు విద్యార్థి లోకం నిరసన తెలియజేస్తోంది. ఓయూలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. యువ ఎమ్మెల్యేను ఓడించేందుకు ఓయు జేఏసీ సిద్ధమైంది. ఈ ఎన్నికలలో బాల్క సుమన్ ను ఓడించాలని ఓయూ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. గుండా రాజకీయం చేస్తున్నాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాల్క సుమన్ లాంటి ఎమ్మెల్యేలే కారణం మంటూ ఓయూ జేఏసీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలని విద్యార్థి లోకం పిలుపునిస్తోంది. విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also..
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది. గులాబీ బాస్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ వచ్చాక అభవృద్ది ఏ తరహాలో ఉంది చూసి తమను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.




Total views : 91203