కడప జిల్లా… జమ్మలమడుగు లోని బిజెపి కార్యాలయంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి శాసనసభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి (Adinarayana reddy) విలేకరుల సమావేశం నిర్వహించి వైకాపా నాయకులపై నిప్పులు చేరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైకాపా నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. జగన్ పై జరిగిన ప్రతి దాడిని తనపై ఆరోపణలు చేశారని ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను వెనకేసుకువస్తు అన్యాయాలకు వంతపడుతున్నారని వివరించారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు, హెల్త్ క్యాంపులు తాను చేశానని, ఈ నాయకుడు ఏ అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తన సొంత బావమరిది సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేత అవినాష్ రెడ్డిని గెలిపిస్తాను అనడం హాస్య స్పందనముగా ఉందన్నారు. తమ సపోర్ట్ లేకుండా వార్డులలో కూడా తిరగలేని వ్యక్తి వైకాపాను గెలిపిస్తాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూర్యనారాయణ రెడ్డి కోసం తాము అనేక త్యాగాలు చేశామని ప్రస్తుతం ఆయన తమ నాశనం కోరుతున్నాడని ఇది సరైన పద్ధతి కాదని సూర్యనారాయణ రెడ్డి పై నిప్పులు చేరిగారు. అమిత్ షా జమ్మలమడుగు నియోజవర్గానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అన్నారు. ఈనెల 25వ తేదీన జమ్మలమడుగులో జరిగిన ర్యాలీ సక్సెస్ అయిందని ఈ సక్సెస్ తో తన గెలుపు ఖరారు అయినట్టేనని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…






Total views : 90557