Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra PradeshKadapa వైకాపా నాయకులపై నిప్పులు చెరిగిన ఆదినారాయణ రెడ్డి..

వైకాపా నాయకులపై నిప్పులు చెరిగిన ఆదినారాయణ రెడ్డి..

by Rama
Adinarayana Reddy

కడప జిల్లా… జమ్మలమడుగు లోని బిజెపి కార్యాలయంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బిజెపి శాసనసభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి (Adinarayana reddy) విలేకరుల సమావేశం నిర్వహించి వైకాపా నాయకులపై నిప్పులు చేరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైకాపా నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. జగన్ పై జరిగిన ప్రతి దాడిని తనపై ఆరోపణలు చేశారని ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసు అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను వెనకేసుకువస్తు అన్యాయాలకు వంతపడుతున్నారని వివరించారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు, హెల్త్ క్యాంపులు తాను చేశానని, ఈ నాయకుడు ఏ అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఆరోపణలు చేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

తన సొంత బావమరిది సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేత అవినాష్ రెడ్డిని గెలిపిస్తాను అనడం హాస్య స్పందనముగా ఉందన్నారు. తమ సపోర్ట్ లేకుండా వార్డులలో కూడా తిరగలేని వ్యక్తి వైకాపాను గెలిపిస్తాం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూర్యనారాయణ రెడ్డి కోసం తాము అనేక త్యాగాలు చేశామని ప్రస్తుతం ఆయన తమ నాశనం కోరుతున్నాడని ఇది సరైన పద్ధతి కాదని సూర్యనారాయణ రెడ్డి పై నిప్పులు చేరిగారు. అమిత్ షా జమ్మలమడుగు నియోజవర్గానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అన్నారు. ఈనెల 25వ తేదీన జమ్మలమడుగులో జరిగిన ర్యాలీ సక్సెస్ అయిందని ఈ సక్సెస్ తో తన గెలుపు ఖరారు అయినట్టేనని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
  • జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.
    జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు…
  • గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.
    గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే…
Advertisements

You may also like

Our Visitor

019320
Total views : 90341

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.