అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన తాడిపత్రి నడిబొడ్డున ఉన్న 100 పడకల ఆసుపత్రిని ఆర్భాటంగా అయితే ప్రారంభించి మిగతా నిర్మాణ పనులను మధ్యలోనే వదిలేసారు.వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్ సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి 100 పడకల ఆసుపత్రిని నిర్మాణ దశలో ఉండంగానే ఎన్నికల కోడ్ వస్తే తమకు రావాల్సిన పేరు ఎక్కడ వెళ్ళిపోతుందో అనే ఉద్దేశంతో కనీస వసతులు కల్పించకుండా ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకునేందుకు ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు.తీరా చూస్తే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ ఎక్కడికక్కడ పనులను వదిలేసి వెళ్లారు.కేవలం మొదటి అంతస్తులో .రోగులకు సౌకర్యంగా భవనము ఉంటుందని అనుకున్నారు. అయితే గత ప్రభుత్వ వైకాపా నాయకుల అసమర్ధతతో నిర్మాణములో ఉన్న ఆసుపత్రి నాసరికంగా చెప్పట్టిన గదుల నిర్మాణ పనులు ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది.24 కోట్ల వ్యయంతో
ఆసుపత్రి భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు అయినప్పటికి తాడిపత్రి ప్రజలకు ఎటువంటి వైద్య సేవలు అందలేదు.ఇందుకు వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకు నిర్మాణంలో ఉన్న భవనాన్ని ప్రారంభించారు.వంద పడకల ఆసుపత్రిలో కేవలంకొన్ని గదులే వాడుతు మిగతా గదులన్నీ నిర్మాణ దశలోనే ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.రెండవ అంతస్తు,మూడవఅంతస్తు,నాలుగవంతస్తు,ఈ మూడు అంతస్తులు నిర్మాణ దశలోనే మిగిలిపోయాయి.అంతేగాక వర్షం వస్తే వర్షపు నీటితో ప్రభుత్వ ఆసుపత్రి ఒక కుంటను తలపించేలా మారింది..ఇలా అరకోర వసతులతో భవనాన్ని ప్రారంభించి ప్రజల ప్రాణాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెలగాటం ఆడరని ప్రజలు తెలిపారు.తాడిపత్రి ప్రజలకు మంచి జరగలన్నా అభివృద్ధి చేయాలన్నా ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేయాలన్న కేవలం జేసితో మాత్రమే సాధ్యమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.