తెలంగాణ కవులు, కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఒక వ్యక్తి కోసమో.. ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదని అన్నారు. ఉద్యమాన్ని కవులు, కళాకారులు భుజాన వేసుకొని నడిపించారని కొనియాడారు. తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు స్థూపం రూపొందించిన ఎక్కా యాదగిరిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఫోర్త్ సిటీలో ఎక్కా యాదగిరికి 300 గజాల స్థలంతో పాటు రూ.కోటి నగదు అందజేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆయనతో పాటు ప్రముఖ కవులు.. గూడ అంజయ్య, గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ సహా మొత్తం తొమ్మిది మంది కవులకు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, కోటి రూపాయల నగదు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 90683