అంగన్వాడీ(Anganwadi) కేంద్రాల్లో పనిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విషయంలో తెలంగాణ సర్కార్(Telangana government) సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలను ఏప్రిల్ 30వ తేదీ నాటికి పంపించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఇక రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ సిబ్బందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఒకవేళ ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక గానీ, వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని వెల్లడించింది. కాగా, పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు లక్ష, అలాగే మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ. 50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది.
- ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
- రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారాయన. ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.…
- ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 147203