తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు ముఖ్యమైన రహదారని, పూర్తి గా దెబ్బతినకముందే రక్షణ చర్యలు చెపట్టి ఆధునికీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Breaking News
హబ్సిగూడ లోని మలబార్ గోల్డ్ & డైమండ్ షాప్ లో అభరనాలు చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు పెట్టి ఒరిజినల్ నగలు అపహారించింది. షాప్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిసి పుటేజ్ ఆధారంగా మాయ లేడి ని అరెస్ట్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ లు.
Read Also..
తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగుడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనగంటి రమ్య (22) అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో సామాజిక ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా రామన్నగూడెం, కమలాపురం రహదారి మార్గం సరిగా లేక ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో, ప్రసవించిన రమ్య పాపకు జన్మించింది. అప్పటికి పరిస్థితి విషమించడంతో ఉమ్మనీరు మింగి పాప మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు..ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో..పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా.. రేవంత్ సీఎంగా.. మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు.
ఇక..రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు. ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే, కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గన్నవరం లోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, దళితవాడలోని అంబేద్కర్ విగ్రహాలకు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం -జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరు గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు
సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ భుజంగం మాట్లాడుతూ.. మున్సిపాలిటీ లో ప్రజలకు ఉన్న సమస్యలైన, ఫిర్యాదులైన తమ ద్రుష్టి కి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని, వారి పరిమితి లో లేనివి పై అధికారుల ద్రుష్టి కి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.మున్సిపాటీ అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు, సిబ్బంది కల్సి కట్టుగా కృషి చేయాలనీ కోరారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అలాగే ఉచిత ఇసుక కేసులోనూ చంద్రబాబు పిటిషన్పై విచారణను డిసెంబర్ 12వ తేదీకే వాయిదా వేసింది. ఈ కేసులోనూ ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.




Total views : 194424