మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున ఓ పార్టీ కండువా కప్పుకొని, ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది గంటల వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని ఆ గట్టునుంటావా,ఈ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి చెందిన టప్ప రాము స్థానికంగా మిర్చి బండి వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు..అయితే అతను గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ వున్నాడు..అనూహ్యంగా బీజేపీ పార్టీలో నుండి వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాము కొద్ది గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నినాదాలు చేసాడు..కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ 17 వ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త సతీష్ రాత్రి కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి తెల్లారే స్వంత గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే…ఏది ఏమైనా కండువాల మార్పు కహానితో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎవరు మనవారో,ఎవరు ఎటు పోతారో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు….
brs party
కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు
సంగారెడ్డి లో మంత్రి కేటీఆర్ రోడ్ షో విద్యార్థి, యువజన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తరపున ప్రచారం కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోంది కర్నాకటలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకింది డిసెంబర్ మూడు తారీఖున సంగారెడ్డి కి కాబోయే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కావాలంటా..55 ఏండ్లు ఇచ్చినా ఏం చేశారు మళ్లొకసారి వచ్చి ఏక్ బార్ దో అంటున్నారు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. డి కే శివకుమార్ తెలంగాణలో ఐదు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు వాళ్లకు ఇక్కడ 24 గంటల కరెంటు కనిపించడం లేదా సంగారెడ్డి నియోజకవర్గం లోని ఏ ఊరిలో నైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకోండి తెలుస్తుంది… కరెంటు ఉందో.. లేదో..కరెంట్ తీగలు పట్టుకోండి దేశం దరిద్రం పోతుంది. తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతుక కేసీఆర్. కేసీఆర్ ను ఖతం చేసేందుకు చూస్తున్నారు. 55 కిలోల కేసీఆర్ ను కొట్టేందుకు మోడి, అమిత్ షా, రాహుల్ గాంధీ, ఠాక్రే పోటీ ఎందుకు..? కేసీఆర్ గొంతుక పిసికేందుకు షంషేర్ లు తీస్ మార్ ఖాన్ లు వస్తున్నారు. సింహ మెప్పుడు సింగిల్ గానే వస్తుంది, 95 సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది
ఐదు సంవత్సరాలు మీ కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి తనకు మార్కులు వేయాలని మంత్రి హరీష్ రావు కోరారు..సిద్దిపేట అభివృద్ధి కోసం కష్టపడ్డానని,ఎన్నికల సమయం లో హడావుడి చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు కోరారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాకు మీరు ఓట్ల రూపంలో మార్పులు వేసి దీవించాలని ఆయన కోరారు..
సిద్దిపేట జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి 50 మంది మహిళా కార్యకర్తల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు..
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది. గులాబీ బాస్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ వచ్చాక అభవృద్ది ఏ తరహాలో ఉంది చూసి తమను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సిద్ధమయ్యింది. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలోని.. అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు. గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా.. సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాట్లు చేసింది.
జనగామ జిల్లా, నవంబర్ 7, మంగళవారం, జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. కుటుంబం సభ్యులతో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 2 నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మురళి కృష్ణకు 098 అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్ధిగా తన 2 సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యేగా మంత్రులుగా జనగామను అభివృద్ధి చేసిన వారు నా వెంట ఉన్నారు. వారు సూచనలు సలహాలు తీసుకొని కురుక్షేత్రంలో కూడా ముందుకు వెళ్తానని చెప్పారు ఎన్నికల్లో గెలుస్తానని ఉధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పలు కాలనీల కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని అంబేద్కర్ కాలనీలో టిఆర్ఎస్ రాష్ట్ర నేత గూడెం మధుసూదన్ రెడ్డి సమక్షంలో దాదాపు రెండు వందల మందికి పైగా యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
తెలంగాణ కోసం కేసీఆర్ మొన్న ఓ మాట అన్నారని, తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు మనకు కొట్లాడేవాడు కావాలన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారన్నారు. బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే సీఎం ఆఫీస్ స్పందించిందన్నారు. మనం నీళ్లిచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని, ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. హరీశ్ రావు వంటి బాహుబలిలు ఉండగా ఢోకా లేదన్నారు.