Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh రైతుల ఆందోళనను గాలికి వదిలేసిన వైయస్సార్ ప్రభుత్వం..

రైతుల ఆందోళనను గాలికి వదిలేసిన వైయస్సార్ ప్రభుత్వం..

by Satya
NTR Dist

జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య NTR జిల్లా జగ్గయ్యపేట మండలం లోని పత్తి, మిర్చి, వరి తదితర పంటల సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న టీడిపి నేతలు విత్తనం దగ్గర నుంచి ఎరువులు, మందులు, నాట్లు, కలుపులు తీసి వరికి 40వేలు, పత్తికి 50వేలు, మిర్చికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి చివరకు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోని ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల క్రింద నిధిని ఏర్పాటు చేస్తామని, పంటల భీమా పథకాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్దానం విస్మరించి కనీసం రైతులకు సాగునీరు అందించలేని, ఈ ప్రభుత్వం విధానాలను ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రైతు సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి జగ్గయ్యపేట మండలంలో రెడ్డి నాయక్ తండా, అన్నవరం గ్రామాలలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలన. నెట్టెం శ్రీ రఘురాం మాట్లాడుతూ రైతుల ఆందోళనను వైయస్సార్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రెడ్డినాయక్ తండాలో 40 సంవత్సరాల క్రితం ఉన్న స్కీం పట్టించుకోకుండా సాగునీరు అందకపోవడం వల్ల జగ్గయ్యపేట మండలంలో సుమారు వరి 200 ఎకరాల్లో మిరప 150 ఎకరాల సుమారు పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంకా ఇతర పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మోటర్లు పెట్టి సాగునీరు పంట పొలాలకు ఇవ్వాలన్నా సరిపడా కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉంది. మొన్న క్యాబినెట్ సమావేశంలో కనీసం రైతుల గురించి ఆలోచించని జగన్ ప్రభుత్వం రైతులను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వారి తాబేదారులకు లంచం చేకూర్చడంలో ఉన్న ఉత్సాహంలో 10% అయినా రైతులుపై పెట్టాలి. జగ్గయ్యపేట మండలంలో జరిగిన పంట నష్టాన్ని అధికారులు వెంటనే సర్వే చేసి వారికి పంట నష్టం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాతయ్య మాట్లాడుతూ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల రైతులకు కంట కన్నీరు మిగిలింది. మిర్చి, వరికి రైతులు పెట్టుబడి పెట్టి నీరంధక నష్టపోయారన్నారు. చంద్రబాబు నాయుడు హాయంలో ముక్త్యాల స్కీమ్ శంకుస్థాపన చేసి రైతులకు సాగునీరు అందించాలని కృషి చేస్తే, ఈ ప్రభుత్వం స్కీం స్థలాన్ని వేదాద్రి కి మార్చి పనులు ఆపు వేయడం వల్ల రైతులు సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కంచెల-వేదాద్రి స్కీం ఆగిపోవడం జరిగింది. బూదవాడలో నెట్టెం రఘురాం హాయంలో స్కీమ్ ఏర్పాటు చేశారు. నిధులు లేవని వంకచూపి వైసిపి ప్రభుత్వం స్కీం ఆపివేయడం జరిగిందన్నారు. నిర్లక్ష్యం, సరైన ఆలోచన లేకపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టం చవిచూస్తున్నారు. జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్.

Advertisements

You may also like

Our Visitor

025662
Total views : 147643

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.