ప్రతిపక్ష ఎం పి లను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి అన్నారు. కూకట్ పల్లి కే.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో పార్లమెంట్ లో ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను నిరంకుశంగా సస్పెన్షన్ చేసిన దేశ ప్రధాని నరేంద్రమోదీ పై చర్యలు తీసుకోవాలని స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కి యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ డిసెంబర్ 22 న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 143 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ప్రధాని మోదీ ప్రభుత్వ నిరంకుశ, ఫాసిస్టు పాలనను ప్రశ్నించినందుకు అక్కసుగా ఆ 143 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చెయ్యడం పై ధ్వజమెత్తారు. రాష్ట్రం లో బి.ఆర్.ఎస్ నియంతృత పాలనకు ప్రజలు ఏ విధంగా బుద్ది చెప్పారో అదేవిధంగా దేశంలోని ప్రజలు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని అన్నారు. రాబోవు రోజుల్లో ఇదే విధంగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెన్షన్ చేస్తే ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని, పార్లమెంటును ముట్టడి చేస్తామని యువజన కాంగ్రెస్ పార్టీ తరుపున మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.
Brs
తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తామన్న ‘స్వేద పత్రం’ వాయిదా పడింది. ఇవాళ కాకుండా రేపు రిలీజ్ చేస్తామని పార్టీ ప్రకటించింది. తమ పాలనలోని రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా ప్రజలకు వివరిస్తామని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కౌంటర్గా బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ఇన్నాళ్లు తెలంగాణలో అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని అన్ని వివరాలు స్వేదపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పర్యటించారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజికవర్గం కావడం పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ మొదటి సారి హుజూర్ నగర్ కి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మంత్రి హోదాలో మొదటిసారి రావడంతో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా నిర్మింప తలబెట్టిన మోడల్ కాలనీ ఇళ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఇరువురు మంత్రులు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప పదేళ్ల BRS ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి నిర్మించలేదన్నారు. మూడు నెలల్లో ఈ మోడల్ కాలనీలో ఉన్న అన్ని ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదవారికి అందజేస్తామన్నారు. తాము ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు, తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసిన మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు.
మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. పివీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి నేతృత్వంలో 40 వేల కోట్లతో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందన్నారు. పివి శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పీవీ స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్ట పరచడానికి నవోదయ, గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదే అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూసంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ మహనీయుని సేవలను నిరంతరం ఇప్పటి తరానికి పాఠ్యపుస్తకాలల్లో, దృశ్యరూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు.
శుక్రవారం పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని, పార్లమెంటు భద్రతా వైఫల్యాల చర్చకు తావివ్వకుండా సభ్యులను సస్పెన్షన్ చేసి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. పార్లమెంటులోకి చోచ్చుకొని వచ్చిన అగాంతకులు బిజెపి పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతోనే బిజెపి పీఠాలు కదులుతున్నాయని మండిపడ్డారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వచ్చి గెలవడం బిజెపికి ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని, సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళుతుందని, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి చేస్తున్న చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, బిజెపి చేసిన చర్యను అందుకే బిఆర్ఎస్ ఖండించలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన వెంకటయ్యను గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించిందని, అతని భార్య సర్పంచ్గా కూడా వ్యవహరిస్తోందన్నారు.
సింగరేణి బొగ్గు గని కార్మికుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కార్మిక నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి అనుభంద సంఘంగా ఉన్న టీబీజీకెఎస్ ఏడో దఫా ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న నిర్ణయంపై ముఖ్య నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లిన వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యలు గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని గమనించిన ముగ్గురు నాయకులు కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు తమ రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. వరసగా రెండు సార్లు సింగరేణి గనుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న టీబీజీకెఎస్ ఈ సారి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడకుండా చేసిందనే చెప్పాలి. దశాబ్దాలుగా సింగరేణి కార్మికులతో అనుభందం పెనవేసుకున్న ముగ్గురు నాయకులు టీబీజీకెఎస్ నుండి పోటీ చేసి మరోసారి పట్టు నిలుపుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వారిని నిరాశకు గురి చేసింది. దీంతో ముగ్గురు ముఖ్య నాయకులు కూడా పదవులకు రాజీనామా చేయడం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణ..?
మరో ఆరు రోజుల్లో గుర్తింపు సంఘానికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. హై కోర్టులో ఇంధన శాఖ పిటిషన్ వేసి చాలినంత యంత్రాంగం లేనందున తాము ఎన్నికలు నిర్వహించలేమని… ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అయితే గురువారం హై కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో టీబీజీకేఎస్ పోటీ చేయవద్దన్న తీసుకున్న నిర్ణయంతో ముఖ్య నాయకులు ముగ్గురు కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే కార్మిక వర్గాల్లో ప్రభావం చూపించే నాయకులు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందున్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరో కార్మిక సంఘానికి అనుకూలంగా వీరు ప్రచారం చేస్తారా లేక వేరే కార్మిక సంఘంలో చేరి తమ పట్టు నిలుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం అంతుచిక్కకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కారణమా లేక అధికారంలో ఉన్నప్పుడే కార్మిక సంఘాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమా అన్నది మాత్రం పజిల్ గా మారింది. అయితే ఈ సారి జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం గులాబీ జెండాలు కనిపించవని మాత్రం తేలిపోయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాస్ పీకారు. పదే పదే స్పీకర్ పోడియం వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ పై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భట్టి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి పదే పదే అవాంతరం కలిగించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. తొలుత కౌశిక్ రెడ్డిని నియంత్రించాలని స్పీకర్ ను అభ్యర్థించారు. ఓ దశలో స్పీకర్ ప్రసాద్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సున్నితంగా మందలించారు.
Read Also..
Read Also..
అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం పై జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఫ్రీ కరెంట్ పెటెంట్ కాంగ్రెస్ దే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభాకర్ రావు దోచిపెట్టారన్నారు. విద్యుత్ రంగంలో అవకతవకలపై విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దొంగలు, అవినీతి అంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఎవరు ఎంత తిన్నారో అంత కక్కిస్తాం వదిలేస్తామా అని అన్నారు. టెండర్ లేకుండా పవర్ ప్లాంట్ పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ 24 గంటల విద్యుత్ ఇచ్చిందనేది పచ్చి అబద్ధమన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో 20వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందన్నారు. ఇందులో జగదీష్ రెడ్డి 10వేల కోట్ల రూపాయలు తిన్నారన్నారు. దీనికి స్పందించిన జగదీష్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు.
Read Also..
Read Also..
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.