కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని కాంగ్రెస్ విమర్శించింది. లెక్కలతో గిమిక్ చేసిందని ఆరోపించింది. తెలంగాణ వచ్చాక కేవలం 60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2023కల్లా 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ది చెందినా గ్రామాలన్నీ కన్నీరు కారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పథకంలో చూసినా అవినీతి తాండవిస్తోందన్నారు. అందుకే నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలికిపడుతున్నారని మదన్ మోహన్ రావు విమర్శించారు.
Brs
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాడివేడీ చర్చల తర్వాత ఈ నెల 20వ తేదీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగ్లు, ఘాటైన మాటల తూటాలతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కిపోయింది. తన ప్రసంగాన్ని మొదలుపెట్టడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప ఏముంది చెప్పుకోవడానికి అంటూ కేటీఆర్ మాటల తూటాలు పేల్చారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో అయినా కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also..
Read Also..
తెలంగాణ శాసన సభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసన సభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీచేసి కేవలం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం విన్నాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను ఆయన కోట్ చేశారు. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరినీ మోసం చేయనని, ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులను సంహరించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఇలాగే ఉందని, గవర్నర్ ప్రసంగం కూడా అలాగే అనిపించిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని, తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో, ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, నాగార్జున తదితరులు పరామర్శించారు. ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. పదేళ్ల కాలంలో కెసిఆర్ ఎంతో శ్రమించి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు. రాష్ట్ర వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రమని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పదే పదే చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్ బి ఐ నివేదిక విడుదల చేసిందన్నారు. ఆ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84.2 శాతంతో రెండోస్థానంలో ఉందని తెలిపారు. పుష్కలంగా విద్యుత్, నీటి సౌకర్యం ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఎంతో పురోగతిని సాధించామని వినోద్ కుమార్ తెలిపారు.
Read Also..
Read Also..
జవహర్ నగర్ గత మూడు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రు నగర్ కాలనీ లో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా తాసిల్దార్ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిపి కూల్చివేశారు. దీనిపై క్రైస్తవ భక్తులు నెహ్రు నగర్ కాలనీ బస్తి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్, 14 డివిజన్ కార్పొరేటర్ ఆలూరి సంగీత సంఘటన స్థలానికి చేరుకొని తాసిల్దార్ ఆర్ఐ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ప్రార్థన మందిరాన్ని దౌర్జన్యంగా ఏలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం క్రైస్తవుల మనోభావాలను మత విశ్వాసాలను కించపరుస్తూ క్రిస్మస్ పండుగ ముందు ప్రార్థనలు చేసుకోకుండా మందిరాన్ని కూల్చివేయడం హేయమైన చర్యని వారు మండిపడ్డారు. దీనిపైన వెంటనే తాసిల్దార్ క్రైస్తవులకు సమాధానం చెప్పాలని వెంటనే కూల్చిన చోటే చర్చి పునర్నిర్మాణం చేపట్టాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క , కొండా సురేఖ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందర పాటు వద్దని సూచించారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్ను వెంటాడుతోందన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ నర్సపూర్ అంటే బీఆర్ఎస్ కి కంచుకోట అని మరోసారి నిరూపించారు. ఇక్కడ గెలిచాం కానీ ప్రభుత్వం పోయిందని బాధ ఉంది మనకు. బీఆర్ఎస్ కి ఈ ఓటమి ఒక బ్రేక్ మాత్రమే అంతిమ గమ్యం, విజయం బీఆర్ఎస్ దే. కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేశారని ఈ నిజం అతి త్వరలోనే తెలుస్తోందని ఆయన అన్నారు. కేసీఆర్ పనితనం ఉన్న మనిషి తప్ప పగతనం అనేది ఆయన వద్ద లేదని, మనం కాంగ్రెస్ వాళ్ళ మీద పగ బట్టి కేసులు పెడితే సగం మంది జైల్ లోనే ఉండే వారని, కానీ మనం అలా చేయలేదని అన్నారు. హౌసింగ్ పథకంలో కాంగ్రెస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారని సిఐడి నివేదిక ఇచ్చిన, ప్రజలు ఇబ్బంది పడొద్దని పక్కనబెట్టామని కక్షలు, కుట్రలు లేకుండా మేము పనిచేసామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీకి ఒడిదుడుకులు సహజమని, విజయం సాధించినప్పుడు పొంగిపోలేదు అల అని ఓడినప్పుడు కుంగిపోలేదని అన్నారు. పనిమంతులు ఎవరు అనేది త్వరలోనే ప్రజలే గమనిస్తారని పార్లమెంట్ పై దాడిని ఖండించిన నాకు 2009 అదే పార్లమెంట్ లో దాడి జరిగిందని అన్నారు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ దాడి జరిగింది నేడు పార్లమెంట్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న, ఎంపీలు అందరు సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. ఇది సంతోషము నూతన పార్లమెంట్ భవనం కట్టుదిట్టంగా నిర్మాణం చేశారని చెప్పారు.. మాటలు ఘనంగా ఉండడం కాదు..చేతలు ఘనంగా ఉండాలి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారని, రేవంత్ ప్రతి మాటకు మా వద్ద రికార్డ్ ఉందన్నారు. ఆయనను తాము ఎందుకు వదిలి పెడుతామని కేటీఆర్ ప్రశ్నించారు. స్పీకర్ నామినేషన్ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అధికారంలోకి రాగానే 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ చెప్పారు కదా అని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ 4 వేల రూపాయలు ఇస్తామన్నా, కేటీఆర్ 10 రోజులు ఆగండి 15 రూపాయలు వేలు రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదన్నారు. తొలి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు, ఏదీ అని ఆయన నిలదీశారు. రుణ మాఫీకి మేం ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసన్నారు. ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని, కాంగ్రెస్ వారు మాత్రం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు చూసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉండగా చేసిన ప్రతి అప్పుకూ ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. కాంగ్రెస్ వారు చూసుకోకపోతే తమకేం సంబంధం? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని, దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్యు నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చెయ్యడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్కు అవసరమేమో కానీ కాంగ్రెస్కు ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రకటనలను కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
Read Also..
Read Also..