Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Telangana మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు

మదన్ మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Satya
Madan Mohan Rao

కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపారని కాంగ్రెస్ విమర్శించింది. లెక్కలతో గిమిక్ చేసిందని ఆరోపించింది. తెలంగాణ వచ్చాక కేవలం 60 వేల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2023కల్లా 4 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక అంశాలపై చర్చలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ది చెందినా గ్రామాలన్నీ కన్నీరు కారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పథకంలో చూసినా అవినీతి తాండవిస్తోందన్నారు. అందుకే నిజాలు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలికిపడుతున్నారని మదన్ మోహన్ రావు విమర్శించారు.

Advertisements

You may also like

Our Visitor

024297
Total views : 144642

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.