జనగామ జిల్లా కేంద్రంలోని 13 వ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి గడప గడప తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు.. జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది జిల్లా అయిన తరవాత చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు కాబట్టి వాళ్ల అందరికి విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది చేసే పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం చేయలేని పనిలు కాదు అని వివరిస్తున్న జనగాం పట్టణములో చాలామంది పేదలకి ఇళ్లు లేని వారికీ కచ్చితంగా గృహలక్ష్మి ఇస్తాం అని మాట ఇచ్చిన జనగాం సమగ్ర అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్లు ఇస్తాం ఎవరికైతే పెన్షన్ రాలేదో ఒకటే నెలలో పెన్షన్ ఇస్తాం కేసిఆర్ కొత్తగ ప్రవేశ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో గృహ లక్ష్మి, పెన్షన్ పెంపు, గ్యాస్ ధర 400 పథకాలు ప్రచారం చేస్తున్నాం..
Brs
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ లో ఎన్నికలు ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ .. కరీంనగర్ లో డిపాజిట్ కూడా రాణి వ్యక్తి ఇవ్వాళ మాట్లాడు తున్నాడు. అక్కడ నాలుగు సార్లు ఓడిపోయిండు కానీ ఇక్కడికి వచ్చి గెలుస్తా గెలుస్తా అని ఎగురుతాండూ. ఇక్కడికి వచ్చి కులరాజకీయాలు చేస్తున్నాడు. గతంలో ఆయన పై ఉద్యమంలో పెప్పర్ స్ప్రే జరిగింది. దాంతో మూర్ఛ వచ్చి పడిపోయాడు అప్పటి నుండి కోల్పోయి ఏవేవోమాటలు మాట్లాడుతున్నాడు అంటూ పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన బిఆరెస్ అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్.
Read Also..
హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. హుజూరాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని, ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని, తాను సీఎం అవుతానని హరీశ్రావుకు చెప్పే ధైర్యం లేదని, అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు. నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ.. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అక్కడ సీఎంలు మారారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దండి సురేష్ పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, సీపీఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే నిలబడే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు. కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చంద్రశేఖర్ రావు తహతలాడుతున్నాడని, ఈ సారి BRS పార్టీని కట్టడి చేయకపోతే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రబుద్ధుడన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడని అంటున్నారు, ఆయన హైదరాబాద్ ఉంటూ గత ఎన్నికలకి 15 రోజులు ముందు వచ్చాడని, కానీ నేను ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగానని అన్నారు. ఈ ఎమ్మెల్యే అనుచరులు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి అరాచకాలకు అడ్డు వేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు.ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపిచలని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని, బీజేపీ నేతలు హైదరాబాద్కు వచ్చి మాత్రమే కేసీఆర్పై విమర్శలు చేస్తారన్నారు.కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదని,కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మార్చబోతున్నారని, డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మల్లారం బొల్లేపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొని గడపగడప తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లారం బొల్లెపల్లి గ్రామాల నుండి BRS పార్టీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 15 నుండి 20 సీట్లు కూడా రావని అక్కస్సుతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు దింపుడు కాలం దగ్గరికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని సంకల్పంతో ప్రజలు ఉన్నారని ఉద్యోగ వ్యాపార సంఘాలు రైతులు ప్రజలు తమకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో తనను నకిరేకల్ గడ్డపై అత్యధిక మెజారిటి తో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also..
Read Also..
శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని వాటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు… బూటకపు మాటలతో బురద చల్లే పార్టీ లను ప్రజలు తిరస్కరించిండానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. శేరిలింగంపల్లి లో గులాబీ జెండా ఎగుర బోతుందని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ రికార్డు కొట్టబోతున్నారని ఉద్ఘాటించారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. బిజెపి టికెట్టు బీసీలకు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో ఉంటాను అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
కొంతమంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని చేయని వ్యక్తి అని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్లో వచ్చి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ… ఆ రోజు ఒక గంట ఆలస్యమైతే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు. ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఇష్టారీతిన మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొండి కత్తి, కోడి కత్తి అంటూ హేళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు క్యూ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, రాత్రి బావి వద్ద పడుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవన్నారు.





Total views : 92849