కంటోన్మెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత తన తండ్రి స్వర్గీయ సాయిన్న ఆశీస్సులతో ఈ రోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దర్ వెన్నెల ఎదురు కావడంతో ఒకరికి ఒకరు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకున్నారు. తన తండ్రి స్వర్గీయ సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు తన జీవితంని త్యాగం చేశారని తెలిపారు. ఆయన ను ఆశీర్వదించిన విధంగానే కంటోన్మెంట్ ప్రజలు నన్ను కూడా ఆశీర్వదించి ఈ ఎలక్షన్ లలో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానన్నారు.
Brs
ఈ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి. సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయం ఎన్నికలప్పుడు వచ్చేది. ఎవరు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. సిద్దిపేట పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం. మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచన ఏడవసారి బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. సిద్దిపేట ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండి. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ. మీ కష్ట సుఖల్లో ఉన్న సిద్దిపేట ప్రజలు నా కుటుంబ సభ్యులు ఆరు సార్లు అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండి. సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులే కాకుండా కోరని ఎన్నో పనులు చేశా. ఆనాడు తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవి. నేడు రాష్ట్రాన్ని కెసిఆర్ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24లక్షల ఉద్యోగాలు, ఐటీ లో 6లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో లక్ష 80వేల ఉద్యోగాలు కల్పించాం. కొంతమంది ప్రక్క రాష్ట్రం నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, వారు ఇక్కడ ఎం చెప్పదలచుకున్నారు ,ఓటు అడిగే నైతికత లేదు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ను కెసిఆర్ తీర్చిదిద్దారు. కెసిఆర్ పై సెన్సేషన్ ల్ కామెంట్స్ కోసం నోరు జారీ మాట్లాడుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటాదో కెసిఆర్ చేతుల్లో కూడా రాష్ట్రం అలాగే ఉంటది. నమ్మిన నాయకుడు కెసిఆర్ నీ కాదని ఇతర పార్టీలకు ఓట్లు వేయద్దు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తే 10ఎండ్లు తిరిగి వెనుకకు రాష్ట్రం పోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపి వాళ్ళు అభివృద్ధి చేయలేదు. సిద్దిపేట ప్రజలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్, ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు.. ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సురారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జిహెచ్ఎంసి వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలో గులాబీ కండువతో పండుగ వాతవరణంలో భారీ ర్యాలీని నిర్వహించి మరో సెట్ నామినేషన్ ను వేశారు. ఎంఎల్ఎ అభ్యర్థి వివేకానంద.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ గూడూరులో మీడియా సమావేశం. రెండు తెలుగు రాస్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయి. బి ఆర్ ఎస్ చేస్తున్నాదంతా అక్రమాలే అన్యాయలే ఆంధ్రపరదేశ్ లో వైసీపీ కి బీజేపీ కి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం. బీజేపీ కి వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి ఉండడకూడదనేది మోడీ తత్వం బీజేపీ ని వ్యతిరేకించిన వారిపై సిబిఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు. కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ తెరాస బీజేపీ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ బీజేపీ తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ తెరాస బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం హమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారు. మోడీ అమిత్ షా అండతోనే జగన్ ఇన్ని కేసులు ఉన్న బయట తిగితున్నాడు. విభజన చట్టాల్లోని హామీలు అమలు చేయకుండా చేస్తుండేది. బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేదే బీజేపీ సిద్ధాంతం. టి ఆర్ ఎస్ ఇపుడు బి ఆర్ ఎస్ గా ఉంది ఎన్నికల తరువాత వి ఆర్ ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ )గా అవుతుంది. దేశంలో ఇండియా కూటమి రోజురోజుకి బలపడుతోంది. బీజేపీ ఓడిపోతుందనే బయముతోనే దుర్మార్గలాక్కు పాల్పడుతుంది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఎవరైనా హత్యలు మానభంగాలు చేయవచ్చు అటువంటి వారి జొలికి ఏ అధికారి కూడా వెళ్ళరు.
Read Also..
Read Also..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖల్లో చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి అవినాష్ రెడ్డి తోపాటు మిగతా కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కెసిఆర్ ఆయన పథకాలన్నీ నమ్మి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిందని నన్ను నమ్మి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్లోల్లా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధు జంతువు లాంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేర చరిత్రను చూసి మీరు ఓట్లు వేయాల్సిందిగా ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు త్రిబుల్ వన్ జీవోను అలాగే ఉంచాలని కోరుతున్నట్లు కానీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 111 జీవో ను తీసివేయాలని కోరుకుంటున్న అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..
Read Also..
దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన దుబ్బాకకు వచ్చారు. ఆయన సహాయకులు వీల్ ఛైర్ లో ఆయనను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లారు. అంతకు ముందు దుబ్బాకలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 30న దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై గటాని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఆయన పొత్తికడుపులో పొడిచాడు.
మంచిర్యాల జిల్లా లో నామినేషన్ల రగడ చోటుచేసుకుంది. నామినేషన్ వేసే సమయం లో ఇద్దరు అభ్యర్థులు ఒకే సమయానికి రావటంతో కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చెన్నూర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు తహసీల్దారు ఆఫీసుకు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్, కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి లు ఒకేసారి వచ్చారు. అయితే 500 మీటర్ల దూరంలో వివేక్ వాహనాన్ని పోలీసుల నిలిపివేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనానికి పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఇద్దరూ ఒకే సమయానికి రావడంతో ఇరుపార్టీల నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు గ్రూపులను పోలీసులు శాంతింపజేశారు. పోలీసుల తీరుపై వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. అధికారులు రూల్స్ యధేచ్చగా అతిక్రమిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశాను . రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం.. సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన.. పల్లెలు పచ్చ బడ్డాయి.. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్న గులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా..! ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు. మనకు మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందాం. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా.. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ..నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సంబంధ వర్గాల అభ్యున్నతికి బిఆర్ఎస్ కుల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నేతన్నల తలరాతలు మార్చాం. ప్రలోబాలకు లొంగీ పోతే ఆగం ఐతం. గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది. మళ్ళీ డిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు. సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.
ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే టార్గెట్గా దర్యాప్తు సంస్థల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటిపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనం అవుతున్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం, హైదరాబాద్లోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా..? లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అన్నారు.





Total views : 92849